కరణ్ జోహార్ షో లో ప్రభాస్ కు నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చేశాడు. అయితే మన తెలుగు ఇండస్ట్రీ లో ఎవరు నెంబర్ వన్ అని చెప్పాలి అంటే ఏ హీరో కూడా సాహసించి చెప్పరు . అయితే కాఫీ విద్ కరణ్ కార్యక్రమంలో రానా, రాజమౌళితో కలిసి పాల్గొన్నాడు ప్రభాస్. ఈ షోలో ఎన్నో విషయాల్ని బయటపెట్టాడు. ఇందులో ఒకటి ఆన్ స్క్రీన్ లో కలిసి నటించే అంశం. ఎన్టీఆర్, మహేష్, చరణ్, బన్నీలో ఆన్ స్క్రీన్ ప్రిఫరెన్స్ లో ఎవరికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తావనే ప్రశ్నకు ప్రభాస్ ఠక్కున ఎన్టీఆర్ అంటూ సమాధానం చెప్పాడు.

ఎన్టీఆర్ కు నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చిన ప్రభాస్

ఎన్టీఆర్-ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్. మల్టీస్టారర్ చేయాల్సి వస్తే గోపీచంద్ లేదా తారక్ తో చేస్తానని గతంలోనే ప్రకటించాడు ప్రభాస్. ఎప్పట్లానే ఈసారి కూడా ఎన్టీఆర్ పేరే చెప్పాడు. ఎన్టీఆర్ తర్వాత మహేష్ కు రెండో ర్యాంక్ ఇచ్చాడు. తర్వాత బన్నీ, చరణ్ పేర్లు చెప్పాడు. ఈ షోలో ప్రభాస్ బద్దకంపై మరోసారి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ చాలా బద్దకస్తుడంటూ రానా చెబితే, దాన్ని రాజమౌళి కాస్త కవర్ చేశాడు. ఇక ఇదే షోలో త్రిషతో ఎఫైర్ పై రియాక్ట్ అయ్యాడు రానా.

Image result for koffee with karan johar bahubali team

త్రిషతో డేటింగ్ చేశావు కదా, పెళ్లెందుకు చేసుకోలేదని సూటిగా ప్రశ్నించాడు కరణ్ జోహార్. తమ మధ్య లాంగ్ ఫ్రెండ్ షిప్ ఉంది తప్ప లాంగ్ డేటింగ్ లేదని రానా చెప్పుకొచ్చాడు. ఎక్కువ కాలం ఫ్రెండ్లీగా ఉండడం వల్ల చాలామంది డేటింగ్ అని భ్రమపడ్డారని, అందులో నిజంలేదని అన్నాడు. పెళ్లెప్పుడు అని అడిగితే చరణ్, బన్నీ పెళ్లి చేసుకొని బిజీ అయిపోయారని, తను అలా బిజీ అవ్వనని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: