తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  సామ్రాట్ చిత్రంతో తన ప్రస్థానం మొదలు పెట్టిన నాగార్జున ఇండస్ట్రీలో మన్మధుడు, కింగ్ అని పిలుస్తారు.  ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నటిస్తున్న నాగార్జున వారసులుగా అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  అయితే నాగచైతన్య పది సంవత్సరాల నుంచి సరైన హిట్ కోసం చూస్తుండగా..‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి సైతం మంచి హిట్ లేదు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’చిత్రంలో నటిస్తున్నాడు.

Image result for mr majnu movie stills

  ఈ చిత్రంలో రొమాంటిక్ హీరోగా కనిపించబోతున్న అఖిల్ తన పర్సనాలిటీలో కూడా చాలా మార్పులు తీసుకు వచ్చాడు.  నేడు ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్  సాయంత్రం 6 గంటలకు సోషల్ మీడియాలో విడుదల కానుండగా, ఈ విషయాన్ని చెబుతూ అఖిల్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ స్టిల్ ను ఉంచాడు.  "ఇందుకోసం నేనెంతో కష్టపడ్డాను.


మూడు నెల నరకం. కానీ ఇప్పుడు అది స్వర్గమనే అనుకుంటున్నా. ఇందుకు నా ట్రయినర్ దిలీప్ కు కృతజ్ఞతలు. నువ్వు లేకుండా ఈ పని చేసుండలేను" అని వ్యాఖ్యానించాడు. మరి మిస్టర్ మజ్ను చిత్రంతో ఇండస్ట్రీకి మరో మన్మధుడు ఎంట్రీ ఇస్తారా..అని అక్కినేని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: