తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది సినీ తారలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదే బాటలో నడిచారు అక్కినేని నట వారసుడు అక్కినేని నాగ చైతన్య..అందాల భామ సమంత. ‘ఏం మాయ చేసావే’చిత్రంతో పరిచయం అయిన ఈ జంట మనం చిత్రం తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని పెద్దలను ఒప్పించి రెండు సాంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు.
పెళ్లై ఏడాది దాటినా ఇంకా లవర్స్ లాగే కనిపిస్తూ ఉంటారు. చైతు పెద్దగా పర్సనల్ విషయాలు షేర్ చేసుకొనేందుకు ఇంట్రెస్ట్ చూపించడు గానీ సమంతా తరచుగా తనకు.. చైతుకు సంబంధించిన అప్డేట్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం చై-సామ్ జంట ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలి' చిత్రంలో నటిస్తున్నారు.
పెళ్ళయిన తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో.. ఫ్యాన్స్ లో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. తమ ఇంట్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీని చక్కగా అలంకరించిన సమంత, నాగ చైతన్యతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. గత ఏడాది కూడా ఈ జంట క్రిస్మస్ వేడుకలు సంబరంగా జరుపుకున్నారు.