టాలీవుడ్ లోకి ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించి అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించింది పూజా హెగ్డె.  ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హాట్ హాట్ గా రెచ్చిపోయింది.  తెలుగు లో తనకు మంచి గుర్తింపు రాలేదు అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’సినిమాలో బికినితో కనిపించి కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. ఆ తర్వాత పూజి హెగ్డెకి వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’సినిమాలో జిల్ జిల్ జిగేలు రాజా..అంటూ మరోసారి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. 
Image result for allu arjun pooja hegde BIKINI
ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’సినిమాలో నటించింది.  ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ప్రభాస్ ‘సాహూ’సినిమాలో నటిస్తూనే..'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ సినిమా 1960 కాలంనాటి ప్రేమకథగా రూపొందుతుందనీ, శ్రీమంతుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడనే వార్త ఇటీవలే బయటికి వచ్చింది.
Image result for MAHESH BABU POOJA HEGDE
అయితే ఈ సినిమాలో ఓ పేదింటి అమ్మాయిగా పూజా హెగ్డె కనిపించబోతుందట.  ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డె ల మద్య వచ్చే సన్నివేశాలు హృదయా లకు హత్తుకు పోయేవిధంగా ఉండబోతున్నాయట..మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. యాక్షన్ తో కూడిన ఈ ప్రేమకథను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: