శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ధఢక్ సినిమా  తో మంచి పేరు తెచ్చుకున్నది. ఈ చిత్రంలో జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. జాన్వీ కపూర్ నటనలో ఎలాంటి లోపాలు లేవని అందమైన హావభావాలు పలికిస్తూ బాగా నటించిందని క్రిటిక్స్ అభినందించారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ రెండవ చిత్రానికి సిద్ధం అవుతోంది. జాన్వీ వరుసగా కరణ్ జోహార్ నిర్మాణంలోనే చిత్రాలు చేస్తుండడం విశేషం. జాన్వీ కపూర్ తదుపరి చిత్రానికి సంబందించి లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుంజన్ సక్సేనా బయోపిక్

1999 కార్గిల్ యుద్ధంలో అత్యంత సాహసోపేతంగా గాయపడ్డ సైనికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధం అవుతోంది. కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ లో ఈ చిత్రం నిర్మించబడుతోంది. ఈ బయోపిక్ లో సక్సేనా పాత్రలో నటించబోతున్నట్లు జాన్వీ కపూర్ పేరు వినిపించింది. ఆ వార్తలు నిజమయ్యాయి. ఈ చిత్రం కోసం జాన్వీ అప్పుడే వర్క్ ప్రారంభించేసింది.

జాన్వీ లుక్ వైరల్

జాన్వీ కపూర్ దఢక్ చిత్రం తరువాత కరణ్ జోహార్ నిర్మాణంలోనే థక్త్ చిత్రంలో నటించబోతోంది. ఆ చిత్రానికి ఇంకా ప్రారంభం కాకముందే జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా బయోపిక్ కి సంబంధించిన పనులు ప్రారంభించడం విశేషం. జాన్వీ పైలెట్ డ్రెస్ ధరించి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించే ముందుగా జాన్వీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి కొన్ని ప్రాధమిక విషయాల్లో శిక్షన పొందుతున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: