టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్ ‘కళియుగ పాండవులు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.  మొదట్లో యాక్షన్ తరహా సినిమాల్లో నటించిన వెంకటేష్ కొంత కాలం తర్వాత ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటిస్తూ..తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు.  ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.  గతంలో మహేష్ బాబు తో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాన్ తో గోపాల గోపాల సినిమాల..రామ్ తో మసాలా సినిమాలో నటించాడు. 

అప్పడప్పుడు గెస్ట్ పాత్రల్లో కూడా నటిస్తున్నాడు.  ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన 'ఎఫ్ 2' సినిమా  నటిస్తున్నాడు.  ఈ సినిమాలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్నాడు.  వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారు.

ఇటీవల ఓ లిరికల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా   'ఎఫ్ 2' సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్ ని చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. స్వర్గమే నేలపై వాలినట్టు .. నింగిలోని తారలే చేతిలోకి జారినట్టు .. గుండెలోన పూలవాన కురిసినట్టుగా .. ఎంతో ఫన్ .. ఎంతో ఫన్" అంటూ ఈ పాట కొనసాగుతోంది.

ఈ పాట మేకింగ్ వీడియోకి సంబంధించిన దృశ్యాలపై ఈ వీడియోను కట్ చేశారు. ఈ వీడియోలో వెంకటేశ్ .. తమన్నాలు ఈ వీడియోలో ఎక్కువగా కనిపిస్తున్నారు.  ఆ మద్య రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు కడుపుబ్బా నవ్వించబోతున్నట్లు అర్థం అవుతుంది.  తొలిసారిగా మల్టీ స్టారర్ చేస్తోన్న అనిల్ రావిపూడి .. హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: