బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీని 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి నుండి మొదలవుతుందట.


పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ లతో పాటుగా సినిమాలో విలన్ రోల్ కూడా అద్భుతంగా ఉంటుందట. రాజమౌళి సినిమాలో విలన్ రోల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలుసు. అయితే ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరికి హీరోలకు ధీటైన విలన్ ను చూస్తున్నాడట జక్కన్న.


తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో విలన్ గా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తాడని అంటున్నారు. కన్నడలో వరుస హిట్లు కొడుతున్న యశ్ తెలుగులో కె.జి.ఎఫ్ సినిమాతో వచ్చాడు. డబ్బింగ్ వర్షన్ అయినా తెలుగులో కె.జి.ఎఫ్ బాగానే వసూళ్లు రాబడుతుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్ లో ఈ సినిమా అదరగొడుతుంది. 


ఒకవేళ ఆర్.ఆర్.ఆర్ లో యశ్ నటించడం కన్ ఫాం అయితే అతని కెరియర్ కు మంచి బూస్టప్ దొరికినట్టే. ఇప్పటికే రాజమౌళి ఈగలో సుదీప్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. యశ్ కూడా ట్రిపుల్ ఆర్ లో నటిస్తే మరింత పాపులారిటీ తెచ్చుకునే అవకాశం ఉంది. మరి విలన్ గా యశ్ చేసాడా లేడా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: