హాట్ యాంకర్ రష్మీ ఈమధ్య సోషల్ మీడియాలో తన అభిమానులతో ఛాట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై తన అంచనాలు బయటపెట్టింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో క్రేజ్ ను కొనసాగిస్తున్న ఏకైక హీరో పవన్ మాత్రమే అంటూ ప్రశంసలు కురిపించింది. 

వాస్తవానికి పవన్ సినిమాలు మానేసినా ఆయన అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు అంటూ పవన్ మ్యానియా కొనసాగుతూనే ఉంది అంటూ పవన్ అభిమానులకు ఆనందం కలిగించే కామెంట్స్ చేసింది.  అంతేకాదు ప్రస్తుతం పవన్ ‘జనసేన’ తరఫున చేస్తున్న పోరాటానికి ఇండస్ట్రీ వర్గాలలో చాలామంది నుండి పరోక్షంగా లభిస్తున్న మద్దతు గురించి వివరిస్తూ తన మద్దతు కూడ పవన్ కు ఉంది అంటూ జనసైనికులకు జోష్ ను కలిగిస్తోంది రష్మి.

రాజకీయాలలో మార్పుల కోసం ప్రస్తుతం పవన్ చేస్తున్న పోరాటానికి ఖచ్చితంగా ప్రజల మద్దతు లభిస్తుంది అంటూ ఈమధ్య జరిగిన తెలంగాణ ఎన్నికలలో టిఆర్ఎస్ ఎలా ఘన విజయం సాధించిందో అలాంటి ఘన విజయం జనసేనకు రాబోతోంది అంటూ జోష్యం చెపుతోంది ఈ క్రేజీ యాంకర్. ముఖ్యమంత్రి పదవి పై తనకు ఆశలేదు అంటూ ప్రజా సమస్యల పై పోరాటం చేస్తున్న పవన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాల ఆసలు పెట్టుకున్నారు అంటూ తన అంచనాలను బయట పెడుతోంది.

అయితే అనేక మీడియా సంస్థలు తాము నిర్వహిస్తున్న ఒపీనియన్ పోల్స్ లో పవన్ ‘జనసేన’ కు 5 నుంచి 10 శాతం వరకే ఓట్లు వస్తాయి అని చెపుతున్న నేపధ్యంలో జనంలో పవన్ పట్ల ఉన్న ఈ నిశ్శబ్ద సునామీని రష్మి ఎక్కడ పసిగట్టిందో అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా పవన్ వ్యవహార శైలితో నిరాశ పడుతున్న పవన్ అభిమానులకు రష్మి కామెంట్స్ మంచి జోష్ ను ఇస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు..  



మరింత సమాచారం తెలుసుకోండి: