బాలీవుడ్ లో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరంటే వెంటనే చెబుతారు కండల వీరుడు సల్మాన్ ఖాన్ అని..ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ వివాహం చేసుకోకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒక విషయం చెప్పి దాటేస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ సహనటులు అందరూ వివాహం చేసుకోవడమే కాదు వారి వారసులు కూడా త్వరలో హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ వివాహంపై ఇప్పటికీ ఎన్నో సెటైర్లు వేస్తు ఉంటారు నటీనటులు.
తాజాగా బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ నో ఫిల్టర్ నేహా అనే కార్యక్రమానికి హాజరు కాగా, ఇందులో సల్మాన్ పెళ్ళి గురించి మాట్లాడారు. హీరోయిన్ నేహా దూపియా ప్రస్తుతం బాలీవుడ్ బుల్లితెరపై ఓ ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న కరణ్ జోహార్ అనూహ్యంగా సల్మాన్ పెళ్ళి ప్రస్తావన తీసుకు వచ్చారు. దీనిపై కరణ్ స్పందిస్తూ.. '2019లో సల్మాన్ తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు.. కానీ, అమ్మాయిని మాత్రం కాదు, సల్మాన్ నటిస్తున్న మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు.
ప్రస్తుతం సల్మాన్, అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో భారత్ అనే సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాలో కత్రినా కైఫ్, దిశా పఠానీ కథానాయికలుగా నటిస్తున్నారు. నేడు సల్మాన్ 53వ బర్త్డే కావడంతో ఆయనకి అభిమానుల నుండే కాక పలువురు ప్రముఖుల నుండి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కరణ్ జోహార్ తక్త్ అనే మల్టీ స్టారర్ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నాడు. ఇందులో రణవీర్ సింగ్, కరీనా కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.