రేణూ దేశాయ్ అంటే బద్రి, జనీ సినిమాలు గుర్తుకువస్తాయి, పవర్ స్టార్ పవన్ తో జోడీ కట్టి ఆ రోజుల్లో యూత్ కి అలా కనెక్ట్ అయిపోయింది రేణూ. ఆ తరువాత పవన్ తో పెళ్ళి, విడాకులు ఇలా అన్నింటిలోనూ రేణూ జనం నోళ్ళలో నానుతూనే ఉంది. ఇక ఆ మధ్యన మళ్ళీ పెళ్ళి చేసుకుంటానంటూ హడావిడి చేసిన రేణూ తనకు తెలుగు సినిమాళ్ళో ఆఫర్లు వస్తున్నాయని కూడా చెప్పుకుంది. అయితే తాను దేనికీ ఎస్ అనడంలేదని కూడా పేర్కొంది.


ఇవన్నీ ఇలా అయితే రేణూ ఆ మధ్యన ఓ టీవీ షోలో జడ్జి గా కనిపించి తెలుగు అభిమానులను ఖుషీ చేసింది. ఇపుడు ఆమె మరో కొత్త వేషంలో బుల్లి తెరపైన అలరించనుందని టాక్ వచ్చింది, చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మేకప్ వేసుకుంటోంది. కానీ.. సినిమా కోసం కాదు. టీవీ యాడ్ కోసమన్నమాట. 


కళామందిర్ ‘కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్’ కి రేణుదేశాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఫిక్స్ అయిందట. ఈ డీల్‌లో భాగంగా ఓ యాడ్ ఫిల్మ్ కూడా తీశారు. టీవీ ఎండా‌ర్స్‌మెంట్స్‌లో రేణుదేశాయ్‌కి ఇది మొట్టమొదటిది. సో.. ఇక మీదట బుల్లితెర కమర్షియల్ బ్రేక్స్‌లో తరచూ మెరవనుంది రేణూదేశాయ్. మొత్తానికి కంచి పట్టు చీరలో రేణూ దేశాయ్ చిన్న తెరపై కొత్తగా కనిపించి ఫ్యాన్స్ ని మురిపించనుందన్న మాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: