టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ప్రత్యేకమైన అభిమానం.  సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా వెండి తెరకు పరిచయం అయిన మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ లో ఆటుపోట్లు చవిచూసినా..పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’సినిమాతో ఆయన అదృష్టం ఒక్కసారే మారిపోయింది.  అనూహ్యంగా మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు, అతడు, దూకుడు లాంటి మాస్ ఎలిమింట్స్ ఉన్న సినిమాల్లో నటించి మరింగ స్టార్ డమ్ పెంచుకున్నాడు.  ప్రస్తుతం పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నారు. 
Related image
మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది..మరో ముఖ్యపాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు.   ఈ సంవత్సరం కొరటాల దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాదు..మహేష్ బాబు కెరీర్ లో రూ.200 కోట్లు వసూళ్లు చేసిన సినిమా రికార్డు స్థాపించింది.  అయితే మహేష్ బాబు సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో..ఆయన కుటుంబానికి అంతగానే ప్రాధాన్యత ఇస్తారు.  వీలు చిక్కినపుడు విదేశాల్లో గడిపి రావడం మహేష్ కి అలవాటు.
Image result for mahesh family pics
తాజాగా మహేష్ బాబు ఎగవేసిన జీఎస్టీ పన్ను బకాయిలు తక్షణం చెల్లించాలంటూ హీరో మహేశ్ బాబుకు నోటీసులు జారీ అయిన విషయం హాట్ టాపిక్ గా మారింది. మహేశ్ బ్యాంకు అకౌంట్స్ ని కూడా అటాచ్ చేశారు. దాంతో ఇంత జరుగుతున్నా మహేష్ ఎక్కడ ఉన్నాడంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పోస్ట్ చేసిన ఓ ఫొటో ద్వారా ప్రస్తుతం వారు హాలిడే ట్రిప్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు మహేశ్ బాబు కుటుంబం వెళ్లినట్టు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: