అందాల నగరం విశాఖపట్నంలో నిన్న రాత్రి ‘ఎఫ్ 2’ మూవీ ఆడియో ఫంక్షన్ అత్యంత ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి వెంకటేష్ మాట్లాడిన స్పీచ్ హైలెట్ గా మారింది. తనకు వైజాగ్ కు ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ వెంకటేష్ తన కెరియర్ కు సంబంధించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వైజాగ్ లో చిత్రీకరించిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు వెంకటేష్.

‘మల్లీశ్వరి’ మూవీలో ఇదే బీచ్ లో తాను కత్రినాతో కలిసి రొమాన్స్ చేసిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ ‘సుందరకాండ’ నుంచి ‘ఎఫ్ 2’ వరకూ దాదాపు తాను నటించిన 25 సినిమాలు వైజాగ్ నేపధ్యంలోనే తీయబడ్డాయి అంటూ కామెంట్స్ చేసాడు. అయితే వెంకటేష్ అక్కడతో ఆగకుండా ఈసినిమాకు సంబంధించి హీరోయిన్స్ గా నటించిన తమన్నా మెహరిన్ ఈ ఫంక్షన్ కు రాని సందర్భాన్ని వివరిస్తూ చేసిన ఫన్నీ కామెంట్ అందరినీ నవ్వించింది. ‘మేం వచ్చినా మా పెళ్లాలు రాలేదు అందుకే ఫ్రస్టేట్ అయ్యాం’ అంటూ తమన్నా మెహరిన్ లకు చురకలు అంటించాడు వెంకటేష్. 

ఇదే సందర్భంలో వెంకటేష్ మాట్లాడుతూ తాను గతంలో మహేష్ తో నటించిన ‘సీతమ్మ వాకిట్లో’ మూవీలా ఈమూవీ కూడ బాగా హిట్ అవుతుందనీ వరుణ్ తేజ్ తనకు మరొక యంగ్ బ్రదర్ గా మారిపోయాడు అంటూ మెగా ప్రిన్స్ పై ప్రశంసలు కురిపించాడు.  అయితే ఈ వేడుకకు ఈమూవీలో నటించిన హీరోయిన్స్ ఇద్దరూ మిస్ అయిన విషయం పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

ప్రస్తుతం తమన్నాతో పాటు మెహరిన్ కు కూడ ఈమూవీ విజయం కీలకంగా మారిన నేపధ్యంలో వీరిద్దరూ ఎందుకు ఫంక్షన్ కు రాలేదు అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది. అంతేకాదు ఈమూవీ నిర్మాత దిల్ రాజ్ తో వీరిద్దరికీ ఏమైనా భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయా అన్న కోణంలో కూడ సందేహాలు వస్తున్నాయి. రాబోతున్న సంక్రాంతికి సంక్రాంతి అల్లుల్లుగా వస్తున్న ఈమూవీ ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది అన్న ప్రచారం జరుగుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: