‘గబ్బర్ సింగ్’ మూవీ తరువాత దర్శకుడు హరీష్ శంకర్ టాప్ రేంజ్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోతాడు అని అనుకున్నారు అంతా. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి మాస్ కమర్షియల్ సినిమాను తీసినా ఆసినిమా హిట్ కాకపోవడంతో ఇతడి వైపు ప్రస్తుతం ఏటాప్ హీరో చూడటం లేదు. 
హరీష్ శంకర్ ఫోన్ కాల్
‘దాగుడుమూతలు’ అనే టైటిల్ తో ఒక కథను తయారు చేసినా నిర్మాతలు ఎవ్వరూ సాహసం చేయకపోవడంతో ఒక రీమేక్ సినిమా పై ఆశలు పెట్టుకుని హరీష్ శంకర్ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఈ ప్రయత్నాలలో భాగంగా ప్రస్తుతం హరీష్ శంకర్ ఆలోచనలలో ఉన్న    తమిళ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తాండ’ విషయంలో హరీష్ రవితేజాకు అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ కు అసహనం కలిగేలా ప్రవర్తించాడని ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 
ఇద్దరూ హర్ట్ అయ్యారు
‘జిగర్తాండ’ చిత్రంలో సిద్ధార్థ్ బాబీ సింహా లాంటి నటులకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ చిత్రంలో వారి పాత్రలు హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా బాబీ సింహా నటించిన నెగిటివ్ రోల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనీ హరీష్ నిర్ణయించుకుని ‘అమర్ అక్బర్ ఆంటోని’ షూటింగ్ టైమ్ లో ఈకతను వివరించి రవితేజ అంగీకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరో పాత్రకు సాయి ధరమ్ తేజ్ ను కూడ ఎంపిక చేసి తన ప్రయత్నాలు మొదలు పెట్టాడట. 
సాయిధరమ్ తేజ్ కూడా
అయితే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో హరీష్ శంకర్ ఈసినిమా విషయమై మళ్ళీ రవితేజ వద్దకు వెళ్లలేదని సమాచారం. అంతేకాదు పరాజయాల బాటలో ఉన్న సాయి ధరమ్ తేజ్ ను కూడ ఈసినిమా విషయమై సంప్రదించకుండా ఇప్పుడు అదే మెగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్ కు ఈకథను చెప్పి అతడి అంగీకారం పొందినట్లు తెలుస్తోంది. ఈసినిమాలో మరో హీరోగా నాగ శౌర్యతో ప్రస్తుతం హరీష్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. జరుగుతున్న ఈవిషయాలు అన్నీ రవితేజ సాయి ధరమ్ తేజ్ ల దృష్టికి రావడంతో హరీష్ శంకర్ పేరు చెపితే ప్రస్తుతం వారిద్దరు మండిపడుతున్నారు అంటూ ఆ పత్రిక ప్రచురించిన ఆసక్తికర కథనం సంచలనంగా మారింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: