కోలీవుడ్ యాక్షన్ హీరో కమ్ తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్ త్వరలో ఒకింటి వాడు కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల కొందరు ప్రొడ్యూసర్స్తో విశాల్కి ఉన్న విభేధాల కారణంగా వారు సంఘం కార్యాలయానికి తాళం వేయడం, విశాల్ తాళం పగలగొట్టడం, పోలీసులు విశాల్ని అదుపులోకి తీసుకోవడం లాంటి పరిణామాలు ఇటీవల చెన్నైలో జరిగాయి. ఈ సంవత్సరం విశాల్ నటించిన డిటెక్టీవ్, అభిమన్యుడు, పందెం కోడి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి..ఈ మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
ప్రస్తుతం తమిళంలో టెంపర్ రీమేక్ చేస్తున్నాడు. ఏఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు.ఆయన సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తుంది. ఆ మద్య ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు విశాల్ వివాహానికి సంబంధించిన వార్త హాట్ టాపిక్ అయ్యింది. నడిఘర్ సంఘం బిల్డింగ్ పూర్తైన తర్వాత పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
విశాల్ తండ్రి జీకే రెడ్డి ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ .. విశాల్, అనీషా అనే అమ్మాయితో త్వరలోనే నిశ్చితార్దం జరుపుకోనున్నాడని అన్నారు. వీళ్లిద్దరి నిశ్చితార్థం హైదరాబాద్లో గ్రాండ్గా జరగనున్నట్టు ఆయన తెలిపినట్లు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నెటిజన్లు అనీషా ఎవరో అని తెగ వెతకడం మొదలు పెట్టారు.
గతంలో నటుడు శరత్ కుమార్ కూతురు నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో వివాహం జరగబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఇద్దరూ ఖండించారు. మొత్తానికి కొత్త యేడాదిలో విశాల్ ఒకింటివాడు కావడం చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.