ఈ సంవత్సరం కొత్త హీరోలు, హీరోయిన్లు, దర్శకులు తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ మంచి విజయాలు అందుకున్నారు.  'మెంటల్ మదిలో' సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన వివేక్ ఆత్రేయ, శ్రీ విష్ణు హీరోగా ఒక సినిమాను రూపొందించబోతున్నారు. ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి.. ఊళ్ళోవారంద‌రి దిష్టి ఈ 2019లో ఎవ్వ‌రికి త‌గ‌ల‌కూడ‌ద‌ని ఆశిస్తూ శుభంభూయాత్ !! అంటూ ఓ వెరైటీ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు బ్రోచేవారెవ‌రురా టీం.  విభిన్న మైన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులకు ఆక‌ట్టుకుంటుందని టీం చెబుతుంది.


అయితే టైటిల్ పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే సినిమా ఖ‌చ్చితంగా వినూత్నంగా ఉంటుందని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. న్యూ ఇయర్లో ఎవరికీ దిష్టి తగలకుండా అందరికీ శుభమే జరగాలని కోరుకుంటూ వెరైటీగా ఈ పోస్టర్ ను వదిలారు. క్రైమ్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన నివేదా థామస్,నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించనున్నారు. 

Image result for hero sri vishnu

ఈ సినిమాలో సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తానికి  టైటిల్ పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే సినిమా అందరి మెప్పు పొందేలా అనిపిస్తుంది. ఇక సైడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు ఈ మద్య పలు సినిమాల్లో సోలోగా తన స్టామినా ఏంటో చూపించాడు.  బ్రోచేవారెవ‌రురా అనే చిత్ర టైటిల్‌కి 'చలనమే చిత్రము .. చిత్రమే చలనము' అనేది ట్యాగ్ లైన్‌గా ఉంచారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలపబోతున్నట్లు చిత్రయూపిట్ పేర్కొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: