సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టిజియస్ మూవీ మహర్షి. ముగ్గురు బడా నిర్మాతలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించి న్యూ ఇయర్ పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూసిన మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 


మహేష్ మహర్షి కొత్త స్టైలిష్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ లో కూల్ గా నడుస్తూ వచ్చే మహేష్ ను చిలిపిగా చూపించిన వంశీ పైడిపల్లి. ఈసారి సూటు బూటు వేసుకుని అదరగొట్టాడు. సినిమాలో మహేష్ డిఫరెన్స్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడని ఇప్పటికే అర్ధమైంది.


భరత్ అనే నేను సక్సెస్ తర్వాత మహేష్ ఏరి కోరి మరి ఈ మహర్షి సబ్జెక్ట్ ఫైనల్ చేశాడు. ఈ సినిమా కోసం రెండేళ్ల నుండి వంశీ పైడిపల్లి వెయిట్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. సినిమాలో మహేష్, నరేష్ ఇద్దరు స్నేహితులుగా కనిపిస్తారట.


2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి దీక్షిత్ కూడా ఉందని తెలుస్తుంది. మొత్తానికి మహేష్ మహర్షిపై రిలీజ్ అవుతున్న పోస్టర్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నాయి. వంశీ పైడిపల్లి సృజనాత్మకత కలిగిన దర్శకుడు మరి మహర్షితో ఎలా ప్రేక్షకుల మనసు గెలుస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: