ప్రభాస్ అభిమానులు అంతా ఈ సంవత్సరం ఆగష్టు 15న విడుదల కాబోతున్న ‘సాహో’ గురించి ఎదురు చూస్తుంటే ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఒక బాలీవుడ్ మీడియా సంస్థ బయటపెట్టిన ఒక షాకింగ్ న్యూస్ ప్రభాస్ అభిమానులను కలవర పెడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో మునుముపెన్నడూ చూడని విధంగా ఈమూవీలో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్న విషయం తెలిసిందే. 
షాకింగ్ ట్విస్ట్
అయితే బాలీవుడ్ మీడియా సంస్థ ఈమూవీ గురించి ఇప్పుడు బయటపెట్టిన ఒక విషయం ఆశ్చర్య పరుస్తోంది. ఆ మీడియా సంస్థ కథనం ప్రకారం ఈమూవీలో యాక్షన్ తో పాటు కామెడి కూడా హైలైట్ గా నిలుస్తుందని సమాచారం అంతేకాదు ఈసినిమా మొత్తం పగలబడే నవ్వే విధంగా ఉంటుందని ఆ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. 
కళ్ళు చెదిరేలా యాక్షన్
ఒక్క మాటలో చెప్పాలంటే రజనీకాంత్ సినిమాల తరహాలో ‘సాహో’ సాగుతుందని అంటున్నారు. రజనీ చిత్రాల్లో యాక్షన్, కామెడీ సపరేటుగా ఉండదు. రజనీకాంతే విలన్ల పై దాడి చేస్తూనే తన కామెడీ పంచ్ లతో ఎంటర్ టైన్ చేస్తాడు. ఇప్పుడు ‘సాహో’ లో కూడ ప్రభాస్ రజినీ స్టైల్ ను అనుసరిస్తున్నట్లు ఆమీడియా సంస్థ కథనంలో పేర్కొన బడింది. 
 సాహో తర్వాత లవ్ స్టోరీ
దీనితో దర్శకుడు సుజిత్ ప్రభాస్ పై చేస్తున్న ఈ ప్రయోగం వికటిస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయి అన్న టెన్షన్ లో ప్రభాస్ అభిమానులు కలవర పడుతున్నట్లు తెలుస్తోంది.  ఒకవైపు ఈసినిమాలో ‘ధూమ్’ సిరీస్ లో చోరీ సన్నివేశాలు ఎలా ఉంటాయో ‘సాహో’ లో రాబరీ ఎపిసోడ్ కు సంబంధించిన సీన్స్ ఉంటాయి అని ఈచిత్ర యూనిట్ లీకులు ఇస్తుంటే మధ్యలో ఊహించని విధంగా ప్రభాస్ చేత ఈ కామెడీ యాక్షన్ సీన్స్ ఏమిటి అంటూ ప్రభాస్ అభిమానులు గందరగోళంలో ఉన్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: