తెలుగు బుల్లితెరపై తన అందాలతో కుర్రాళ్ల మనసు దోచిన హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది. జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్ గా పరిచయం అయిన అనసూయ అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.  సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో వెండితెరకు కూడా పరిచయం అయిన ఈ అమ్మడు రంగస్థలం చిత్రంలో రంగమ్మ అత్తగా బాగా పాపులారిటీ తెచ్చుకుంది.
Related image
యూత్ లో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి అనసూయ న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న ట్విట్టర్ ద్వారా అభిమానులతో చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ అభిమాని మీ వంటిపై ఉన్న టాటూ ఏంటీ..?మీకు తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అన్ని ప్రశ్నించాడు.  దానిప స్పందించిన అనసూయ.. నా వంటిపై ఉన్న టాటూ ‘నిక్కూ’..అది మా వారి ముద్దుపేరు.

ఇక నేను తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.5,500 అచి తెలిపింది.  ప్రస్తుతం అనసూయ పలు చిత్రాల్లో బిజీగా ఉంది.  'వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా వస్తోన్న 'యాత్ర'లో మీ పాత్ర ఏమిటి?' అనే ప్రశ్నకి మాత్రం అనసూయ సమాధానాన్ని దాచేసింది. ఆ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పను.  కాకపోతే పొలిటికల్ నేపథ్యంలో కొనసాగే పాత్ర అని..ఆ పాత్ర నా కెరీర్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు అంటూ సమాధానం ఇచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: