ప్రభాస్ ఇపుడు ఇంటర్నేషనల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన సినిమా అంటే ఓవరీస్ తో సహా అనేక దేశాలో డిమాండ్ ఉంది.  ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ అగ్ర, దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు.  బాహుబలి లాంటి ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్  ప్రస్తుతం సాహోతో పాటు రాధాకృష్ణ డైరెక్షన్లో మరో మూవీ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా దాదాపు 500 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయనతో మూవీ చేయాలని ఎంతో మంది నిర్మాతలు క్యూ కడుతున్నారు. .


ఈ వరసలోకి ఇపుడు నిర్మాత దిల్ రాజు వస్తున్నారు. ప్రభాస్తో గతంలో దిల్ రాజు  కాంబినేషన్లో మున్నా సినిమా వచ్చింది. కాకపోతే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరోసారి ప్రభాస్ తో పనిచేసేందుకు రాజు ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్లు సమాచారం. ఈసారి అదిరిపోయే హిట్ కొట్టాలని దిల్ రాజు అనుకుంటున్నారుట. అందుకు గానూ సరికొత్తగా డిజైన్ చేస్తున్నారట


ఈ మధ్యన కన్నడ నాట విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ వసూళ్లు చేస్తున్న చిత్రం కేజీఎఫ్. ఆ సినిమా  డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ కాంతోలో సినిమా తీయాలనుకుంటున్నారని టాక్. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ వెళ్లి హీరో ప్రభాస్ తో భేటీ అయ్యారట. దానివెనుక దిల్ రాజు వున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ కనుక మాంచి సబ్జెక్ట్ తో ప్రభాస్ ను ఒప్పించగలిగితే, ఎంతయినా పెట్టి సినిమా చేసేందుకు దిల్ రాజు రెడీగా ఉన్నాడట. మరి ప్రశాంత్, ప్రభాస్ ను మెప్పించదగిన కథ తెస్తాడో లేదో చూడాలి. మొత్తం మీద చూసుకుంటే ఈ కాంబో వినడానికే థ్రిల్ గా ఉంది. మరి చేస్తే ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: