ఆపరేషన్ ‘గరుడా’ అంటూ సంచలనాలు సృష్టించిన శివాజీ కొంత గ్యాప్ తో తిరిగి మీడియా ముందుకు వచ్చాడు. నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన చుక్కల భూమి వ్యవహారం పై వ్యాఖ్యలు చేస్తూ పనిలోపనిగా అలనాటి ఎన్టీఆర్ వెన్నుపోటు సంఘటన పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. 
నేను ప్రత్యక్ష సాక్షిని
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తీస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గురించి మాట్లాడుతూ ఈమూవీ లక్ష్మీ పార్వతి జీవితానికి సంబంధించిన మూవీ మాత్రమే అంటూ అందులో ఎన్టీఆర్ పాత్ర ఏముంటుంది అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు శివాజీ. అంతేకాదు అప్పటి వైశ్రాయ్ హోటల్ సంఘటనలో ఎన్టీఆర్ పై చెప్పు విసిరింది లక్ష్మీ పార్వతికి సంబంధించిన వ్యక్తి మాత్రమే అన్న విషయం బయటపెడుతూ ఆ సంఘటనకు తాను ప్రత్యక్ష సాక్షి అని మరో ట్విస్ట్ ఇస్తున్నాడు శివాజీ. 

ఇదే సందర్భంలో ‘లక్షీస్ ఎన్టీఆర్’ లోని వెన్నుపోటు పాట గురించి మాట్లాడుతూ వెన్నుపోటుకు -వెన్ను దన్నుకు తేడాతెలియని ఒకమనిషి రామ్ గోపాల్ వర్మ అంటూ సెటైర్లు వేస్తున్నాడు. అంతేకాదు రామాయణంలో రాముడు వాలిపై చెట్టు చాటు నుంచి బాణం వేసినపుడు దాని వెనక ఉన్న పరమార్థం వేరు అంటూ రామాయణ కథను ఎన్టీఆర్ వెన్నుపోటు సంఘటనకు అన్వయించి ఆవిషయాన్ని వెన్ను దన్ను గా మారుస్తున్నాడు శివాజీ.  
actor sivaji fires on bjp over operation garuda
గతకొంత కాలంగా అమెరికాలో ఉన్న శివాజీ ఇప్పుడు మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చి చుక్కల భూముల విషయమై పోరాటం చేయడమే కాకుండా ఏకంగా ‘లక్షీస్ ఎన్టీఆర్’ బయోపిక్ విషయంలో ఇప్పుడు వర్మను టార్గెట్ చేస్తూ వేస్తున్న సెటైర్లు వెనుక ఒక బలమైన శక్తి ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే శివాజీ కామెంట్స్ కు లక్ష్మీ పార్వతి మౌనం వహిస్తుందా లేక తన మాటలతో ఎదురు దాడి మొదలు పెడుతుందా అన్న విషయమై ఇప్పుడు అన్ని వర్గాలలోను ఆసక్తి నెలకొంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: