టాలీవుడ్ చందమామ కాజల్ ఓ డైరెక్టర్ మీదా ఫైర్ అయిందన్న న్యూస్ ఇపుడు వైరల్ అవుతోంది. కాజల్ కి ఎందుకు కోపం వచ్చిందింది, దానికి దారి తీసిన కారణాలు ఏంటన్నది ఇపుడు ఇంటెరెస్టింగ్ పాయింటుగా ఉంది. టాలీవుడ్లో దశాబ్ద కాలం  పైగా హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ విషయంలో ఎటువంటి వివాదాలు ఎప్పుడూ లేవు. మరి ఇపుడు ఇలాంటి న్యూస్ రావడమేంటన్న దానిపై వేడిగా  చర్చ సాగుతోంది.


కాజల్ ప్రస్తుతం తెలుగులో తేజా డైరెక్షన్లో సీత అనే లేడీ ఓరిఎంటెడ్ మూవీ చేస్తోంది. ఈ మూవీలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ తేజా కాజల్ అందాలను ఆరబోతకు కొన్ని  సీన్లను పెట్టారని ప్రచారం సాగుతోంది. అవి  అభ్యంతరకరంగా ఉన్నాయన్న‌ కాజల్ వాటిని చేయన‌ని స్పష్టంగా చెప్పడమే కాకుండా డైరెక్టర్ మీద ఫైర్ అయిందని కూడా న్యూస్ వైరల్ అవుతోంది. 


హీరోయిన్ గా మంచి పాత్రలు చేస్తూ టాప్ గ్రేడ్ లో ఉన్న కాజల్ అందాల ఆరబోతకు నో అనేసిందట. కేరీర్లో బాగా ముందుకు వచ్చాక కూడా ఇలాంటి సీన్లు చేయడమేంటని ఆమె గుస్సా అయిందట. పేరు సీత అని సినిమాకు పెట్టి ఇలా చేయడమేంటని కూడా కాజల్ అన్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికి కాజల్ ఫైర్ అయిందన్న వార్త ఇపుడు సెన్సేషనల్ అయింది. ఇక్కడో విశేషం చెప్పాలి. దర్శకుడు తేజా తీసిన లక్ష్మీ కళ్యాణం మూవీ ద్వారానే కాజల్ తెలుగు తెరకు పరిచయం అయింది. మరి ఆ దర్శకుడి సినిమాలో చాలాకాలం తరువాత నటిస్తున్న కాజల్ తన పాత్రపై అభ్యంతరాలు తెలియచేయడం ద్వారా తానేంటన్నది చెప్పకనే చెప్పిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: