టాలీవుడ్ లో మెగా హీరోలకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి సాయిధరమ్, వరుణ్ తేజ్ ల వరకు మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోలే కావడం విశేషం. అయితే మెగాస్టార్ చిరంజీవి తర్వాత పవన్ కళ్యాన్ కి ఎక్కువ మాస్ ఫాయింగ్ ఉంది..ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్, రాంచరణ్ లు వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’సినిమా ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరడంతో ఈ హీరోపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
గతంలో రాంచరణ్ నటించిన సినిమాలకు మినిమం 60 కోట్ల రేంజ్ ఉండేది..ఇక ‘రంగస్థలం’సినిమాతో ఆ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం రాంచరణ్, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘వినయ విధేయ రామ’వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ ట్రైలర్ లో రాంచరణ్ యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి విడుదలకు సంసిద్దమవుతోంది.
ప్రస్తుతం ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 77 కోట్ల బిజినెస్ చేసింది. ఓవర్ సీస్ లో 9 కోట్లు.. కర్ణాటక,తమిళనాడు ఇతర ప్రాంతాలతో కలిపి 94.50 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, వివేక్ ఒబేరాయ్ కీలకపాత్రల్లో నటించారు. జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.
నైజాం : రూ.20 కోట్లు
సీడెడ్ : రూ.15 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.11.70 కోట్లు
కృష్ణా : రూ.6.40 కోట్లు
గుంటూరు : Crరూ.7.80 కోట్లు
ఈస్ట్ గోదావరి జిల్లా : రూ.7.20 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లా : రూ.5.60 కోట్లు
నెల్లూరు : రూ.3.30కోట్లు
మొత్తం ఆంధ్రా/తమిళనాడు : రూ.77.00 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ.8.50 కోట్లు
ఓవర్ సీస్ : రూ.9.00 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.94.50 కోట్లు