స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాపై సస్పెన్స్ వీడింది.మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరెక్షన్లో ఆయన చేసే మూవీ తొందరలోనే పట్టాలు ఎక్కబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్ డేట్ బయటకు వస్తోంది. దాంతో బన్నీ అభిమానుల్లో ఆసక్తి బాగా పెరిగిపోతోంది. 


ఇక బన్నీ న్యూ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. తెలుగులో భరత్ అను నేను మూవీతో ఎంటరై సూపర్ హిట్ కొట్టిన కియారా  తరువాత మూవీ  మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేసి టాలీవుడ్ హాట్ ఫావరేట్ అయిపోయింది. ఈ మూవీకి కూడా పాజిటివ్ బజ్ ఉంది. దాంతో హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. 


ఇక కియారా చేసే తరువాత సినిమా ఏంటన్న దానిపైన చర్చ సాగుతున్న టైంలో బన్నీ త్రివిక్రం మూవీలో సెలెక్ట్ చేస్తారని టాక్ బయటకు వచ్చింది. ఇదే జరిగితే కియారా మూడవ మూవీతోనే టాప్ పొజిషన్ లోకి వెళ్ళడం ష్యూర్ అంటున్నారు. ఇక ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ కలసి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోయే ఈ మొవీలో మరెన్ని అప్ డేట్స్ బయటకు వస్తాయో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: