హన్సిక తెలుగులో తన గ్లామర్ తో కుర్ర కారుకి కేక పుట్టించిన బ్యూటీ. ఆమె దేశముదురుతో యూత్ బాగా కనెక్ట్ అయి దేవదాసులైపొయారు. ఆ తరువాత జూనియర్ ఎంటీయార్ తో పాటు, రవితేజ వంటి హీరోల పక్కన నటించి  మెప్పించిన హన్సిక ఇపుడు సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తూ వస్తోంది. ఆమె ప్రస్తుతం మహా అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఇన్నాళ్ళూ అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇచ్చిన హన్సిక ఇపుడు నటనకు మార్కులు వేస్తోంది. 


ఇవన్నీ ఇలా ఉంటే కొత్త ఏడాది మొదలవుతూనే ఈ ముద్దు గుమ్మ ఓ సెన్సేషనల్ న్యూస్ చెప్పింది. తన కొడుకు ఈ ఏడాది పదవతరగతి పరీక్షలు రాస్తున్నాడని, అతను మంచి మార్కులు సాధించి నంబర్ వన్ స్టూడెంట్ గా తయారు చేయడమే తన లక్షం అంటూ చెప్పుకొచ్చింది. విన్న వారికి మతి పోయే వార్త ఇది. హన్సిక ఎపుడు పెళ్ళి చేసుకుంది. చేసుకున్నా అంత పెద్ద కొడుకు ఎలా వచ్చాడని అంతా ఒక్కసారిగా  షాక్ తినేశారు. 


ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. హన్సిక 34 మంది అనాధ పిల్లలను చేరదీసి చదివిస్తోంది. వారికే తన సంపాదన అంతా వెచ్చిస్తోంది. అందులో ఒకడైన ఓ అబ్బాయి ఈ ఏడాది పదవతరగతి పరీక్ష రాయబోతున్నాడుట. వారిని తన పిల్లలుగా చెప్పుకుంటున్న హన్సిక తన కొడుకు మంచి మార్కులు తెచ్చుకోవాలన్నదే న్యూ యియర్ లో తన కోరిక అని చెప్పడం నిజంగా గొప్ప విషయమే కదూ.


ఎందరో అందమైన వారు ఉన్నారు. కానీ హన్సిక లాంటి అందమైన మనసు ఉన్న వారు ఎందరు ఉంటారు. ఈ అనాధ పిల్లల కోసం హన్సిక ముంబైలో ఒక శరణాలయం కూడా కట్టిస్తోందంటే శభాష్ హన్సిక అని అనకుండా ఉండలేం. మొత్తానికి ఈ న్యూ యియ‌ర్ హన్సిక కోరిక తప్పకుండా తీరాలని మనమూ కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: