గత కొద్దిరోజులుగా బాలకృష్ణను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్న నాగబాబు ఇప్పడు ఏకంగా ఎన్టీఆర్ బయోపిక్ ను టార్గెట్ చేస్తూ చేసిన వివాదాస్పద కామెంట్స్ నందమూరి అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. దీనితో మెగా బ్రదర్ నాగబాబును మెగా ఫ్యామిలీ హీరోలను ఎలా కార్నర్ చేయాలి అనే విషయంలో ప్రస్తుతం నందమూరి అభిమానులు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 
ఇక పై వరుస సెటైర్లు
ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే వేమన శతకాన్ని అనుసరిస్తూ నాగబాబు తన ట్విటర్ లో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ‘కట్టు కథలు కొన్ని.. కల్పనలు కొన్ని.. చుట్ట నేల.. మూట కట్టనేల.. నిజం కక్కలేని బయోపిక్కులొద్దమ్మా.. విశ్వధాభి రామ వినరా మామ..’ అంటూ సెటైరికల్ కామెంట్స్ పెట్టి తనకు కూడ కవిత్వం వచ్చేసింది అంటూ తనపై తానే జోక్ చేసుకున్నాడు నాగబాబు. 
నిజం కక్కలేని బయోపిక్కులొద్దమ్మా...
దీనితో ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారి నందమూరి మెగా అభిమానుల మధ్య అనవసరపు యుద్ధానికి దారి తీస్తోంది. దీనికితోడు మెగా అభిమానులు నాగబాబు చేసిన కామెంట్స్ కు లైక్ లు కొడుతూ చేస్తున్న హడావిడిని చూసి బాలకృష్ణ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
మెగా అభిమానుల రియాక్షన్
ఇది చాలదు అన్నట్లుగా నాగబాబు తన పోస్టులో స్టే ట్యూన్డ్ అని వ్యాఖ్యానించడం ద్వార ఇకపై చాల సెటైర్లు తన వైపు నుంచి రాబోతున్నాయి అన్న సంకేతాలు ఇస్తున్నాడు. దీనితో జరుగుతున్న పరిణామాల పై బాలయ్య అభిమానులు వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తారా లేదంటే తమ స్పీడ్ పెంచి నాగబాబు పై ఎదురు దాడి మొదలు పెడతారా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: