బుల్లితెర పై అనసూయ రష్మీల తరువాత యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న యాంకర్ శ్రీముఖి. సోషల్ మీడియాలో ఆమెకు లక్షల సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్నారు. అయితే ఆమెకు అనుకోకుండా వైరాగ్యం వచ్చి వేదాంత ధోరణితో పెట్టిన ట్విట్ పై ఆమె అభిమానులే ఎదురుదాడి మొదలు పెట్టడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.
డబ్బు కోసం బ్రతుకున్నాం...
శ్రీముఖి చేసిన కామెంట్స్ బట్టి ప్రస్తుతం ఆమె నిరాశలో ఉన్నట్లు అర్ధం అవుతోంది. అయితే ఆ నిరాశకు కారణం ఏమిటి అన్నది మాత్రం తెలియడం లేదు. మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోందనే మాట ప్రస్తుతం చాల చోట్ల వినిపిస్తూ ఉన్నా అటువంటి పెద్దమాటలు బుల్లితెర పై గ్లామర్ తో మెరిసిపోయే శ్రీముఖి నోటివెంట రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  
అలా జరిగితే సంతోషిస్తా
‘సీరియస్లీ ఇప్పుడు అందరూ కేవలం డబ్బు కోసమే జీవిస్తున్నారు. రాను రాను మనుషుల్లో హ్యుమానిటీ పూర్తిగా నశించి పోతుందేమో అనే భయం కలుగుతోంది జనాల్లో మానవత్వం పూర్తిగా నిశించకముందే ఈ ప్రపంచం అంతమైపోతే చాలా సంతోషిస్తాను దేవుడి దయవల్ల అలా జరుగాలని కోరుకుంటున్నాను’ అంటూ శ్రీముఖి చేసిన ట్విట్ పై చాలామంది మండి పడుతున్నారు.

మరికొందరైతే పటాస్ కార్యక్రమం వల్గర్‌ షో చేస్తున్న శ్రీముఖి నుండి వేదాంతం రావడం ఆశ్చర్యంగా ఉంది అంటూ టివిలలో షో చేస్తున్నది డబ్బుకోసం కదా అంటూ ఆమెను ఎదురు ప్రశ్నలతో ఇరుకున పెడుతున్నారు. అంతేకాదు ఈ ప్రపంచం అంతం అయిపోవాలని తాము కోరుకోవడం లేదని అంటూ తాము చాలాకాలం జీవించాలని ఆసపడుతున్నాం అంటూ శ్రీముఖిని టార్గెట్ చేస్తున్నారు. ఇంతకీ శ్రీముకి వైరాగ్యం వెనుక  కారణాలు ఎప్పుడు బయటపడతాయో చూడాలి.. 




మరింత సమాచారం తెలుసుకోండి: