మెగా అబ్బాయి రాంచరణ్, మాస్ దర్శకులు బోయ‌పాటి శీను కాంబినేషన్ లో ‘విన‌య విధేయ రామ‌’ ఈ నెల 11 థియేటర్లో సందడి చేయబోతుంది.  ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా జరిగింది.  ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేశారు.  డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై రూపొందుతున్న ‘విన‌య విధేయ రామ‌’కి సంబంధించిన ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వర్క్ జోరుగు జరుగుతుంది.  సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంద‌ని చిత్ర బృందం చెబుతుంది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన  త‌స్సాదియ్యా’ ప్రోమో వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మ‌ణి లిరిక్స్ అందించిన ఈ పాట‌ని జ‌స్ప్రీత్ జాజ్‌, మాన‌సి ఆల‌పించారు.  ఈ పాటలో రాంచరణ్ తనదైన డ్యాన్స్ తో ఇరగదీశారు.  ఇక హీరోయిన్ కియారా అద్వానీ మెగా అబ్బాయితో పోటీ పడటానికి చాలా ప్రయత్నాలే చేసింది.   

ఈ వీడియో అభిమానుల‌ని ఆకట్టుకుంటుంది.  ఈ సినిమాకు  దేవి శ్రీ అందించిన బాణీలు అద్భుతంగా ఉన్నాయి. స్నేహా, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, అనన్య, ఆర్యన్‌ రాజేష్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్‌ భామ ఈషా గుప్తా ఇందులోని ప్రత్యేక గీతంలో నటించారు. యాక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించిన‌ట్టు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: