"మణికర్ఱిక–ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ" దర్శకత్వ బాధ్యతల నుండి జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) బయటకు వచ్చేయడం, సినిమా కి దర్శకురాలి గా క్రిష్ పక్కన ఆ సినిమా కథానాయకి "కంగనా రనౌత్" కూడా తన పేరు వేసుకోవడం, ఇవన్నీ ప్రజలందరికీ తెలిసిన విషయాలే. ప్రీ-ప్రొడక్షన్ దగ్గర నుంచి, ఇప్పటి వరకూ ఈ సినిమా బృందంతో క్రిష్ కలవలేకపోయాడు. ఇప్పుడు సినిమా విడుదల సమయానికి అసలు సినిమా బృందానికి క్రిష్కీ మధ్య ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. సినిమా ప్రమోషన్ల లోనూ మణికర్ణిక క్రిష్ పేరుని తలచటానికి కూడా ఇష్ట పడడం లేదు. ఈ సినిమా గురించి మాట్లాడడానికి కూడా క్రిష్ సముఖంగా లేడు.
క్రిష్ మణికర్ణిక సినిమా దర్శకత్వ బాధ్యతలని వదిలేసి, ఎన్టీఆర్ బయోపిక్ కోసం హైదరాబాద్ వచ్చేయడంతోనే అసలు గొడవ మొదలైంది. మిగిలిన సన్నివేశాల చిత్రీకరణ కంగనా రనౌత్ చొరవ తీసుకుని పూర్తి చేసి తానే దర్శకురాలిగా టైటిల్స్ లో తనకు "క్రెడిట్" ఇచ్చుకుంది. అయితే, క్రిష్ సన్నిహితుల వాదన మరోలా ఉంది.
"చివరి వర్కింగ్-టేక్ వరకూ క్రిష్ సినిమా టీమ్-తోనే ఉన్నాడు. ఆ తరవాతే బయటకు వచ్చాడు తాను మరో సినిమా ఒప్పుకున్నానని ఫలానా రోజున వెళ్లాలని కూడా క్రిష్ ముందే చెప్పాడు. క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ లో పూర్తిగా బిజీ అయ్యాక. మళ్లీ ముంబై నుంచి కాల్ వచ్చింది. కేవలం అయిదు రోజుల ప్యాచ్-వర్క్ మాత్రమే మిగిలి ఉంది పూర్తి చేసి వెళ్ళండి అని. ఎన్టీఆర్— బయోపిక్ పనుల ఒత్తిడివల్ల, మణికర్ఱిక ప్యాచ్-వర్క్ లో పాలుపంచు కోవడం క్రిష్కి కుదర్లేదు. ఆ మాత్రం దానికే, కంగనా రనౌత్ తన పేరు వేసేసుకుంది" అనేది క్రిష్ సన్నిహితుల మాట.
ఈ మొత్తం ఎపిసోడ్
వెనుక ఆ సినిమా బృందంలోని ఒక పెద్దాయన హస్తం ఉందట. కంగన రనౌత్ ని రెచ్చ గొట్టి, క్రిష్ పక్కన తన పేరు వేసుకునేలా ప్రోత్సహించారట. నిజానికి ఈ ప్రాజెక్టు క్రిష్
చేతికి రావడానికి కూడా మూల కారణణం కూడా ఆ పెద్దాయనే, క్రిష్ కీ మణికర్ణిక టీమ్
కీ మధ్య అడ్డుగోడలా ఆ పెద్దాయనే నిలిచాడని చెబుతున్నారు. ఆ పెద్దాయన ఎవరు? అనే
దానిపై టాలీవుడ్ లో రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణ ఙ్జానం ఉన్న
వ్యక్తి ఏవరైనా పరిశీలిస్తే — ఆ పెద్దాయన ఎవరో? తెలుస్తుంది.