బాలీవుడ్ లో నటి తనూశ్రీ దత్తా మీటూ ఉద్యమంలో భాగంగా పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  హాలీవుడ్ లో కొనసాగుతున్న మీ టూ ఉద్యమం బాలీవుడ్ లో  తనూశ్రీ దత్తా కొనసాగించారు.  ప్రముఖ దర్శకుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. గత 2008వ సంవత్సరంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని తనూ శ్రీ దత్తా వెల్లడించింది. దాంతో బాలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి.  నానా పటేకర్ పై కొంత మంది నటీ,నటులు విమర్శలు చేస్తే..మరికొందరు ఆయనకు సపోర్ట్ చేశారు.
Image result for tanu sri dutta kangana
తాజాగా  మీటూపై తనూశ్రీ దత్తా మాట్లాడుతూ.. భారత్‌లో తాను మీటూ విప్లవాన్ని ప్రారంభించలేదు. వ్యక్తిగతంగా చేసే పోరాటంతో న్యాయం జరగదు. ఇంకా అది విప్లవం కూడా కాబోదు. తాను బాధితురాలిని కాబట్టి దాని గురించి నోరు విప్పాను.  గతంలో తన కెరీర్ ప్రారంభంలో నానా పటేకర్ చేసిన పనివల్ల ఎంతో నష్టపోయానని..తనను లైంగికంగా వేధించడంతో పదిమందిలో చులకనాగా మారానని అన్నారు. అందుకు కక్ష సాధింపు చర్యగా ప్రస్తుతం మీటూ ఉద్యమంలో భాగంగా తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నానని తనుశ్రీ దత్తా వెల్లడించింది.
Image result for tanu sri dutta kangana
ఇంటస్ట్రీలో నాలాంటి వారు ఎంతో మంది ఉన్నారని..అలాంటి వారికి మీ టూ ఉద్యమం ఎంతో సహాయంగా ఉంటుందని..ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సమస్యలు బాహాటంగా వెల్లడిస్తే..కామాంధులకు చెక్ పెట్టినట్లు అవుతుందని అన్నారు. మార్పు కోసం మీటూ ఓ పరికరంగా ఉపయోగపడిందని తను శ్రీ దత్తా చెప్పుకొచ్చింది. అంతేకానీ తాను చేసిందేమీ లేదని.. తనను పెద్దమనిషిని చేయకండని ఆమె వెల్లడించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: