ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రను ఒక సినిమాగా చెప్పడం కుదరదని భావించిన క్రిష్ సినిమాను రెండు పార్టులుగా విడగొట్టి మరి చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా ఈ నెల 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.


ఇక ఈ సినిమాకు ముందు తేజని హీరోగా అనుకున్నాడు బాలకృష్ణ తేజ డైరక్షన్ లోనే సినిమా భారీగా ఓపెనింగ్ కూడా చేశాడు. కాని ప్రాజెక్ట్ మొదలైన కొద్దిరోజులకే తేజ ఈ సినిమా నుండి తప్పుకోవడం జరిగింది. క్రిష్ రంగంలోకి దిగాక సినిమా వేగం పెరిగింది 3 నెలల్లోనే సినిమా మొత్తం పూర్తి చేశాడు క్రిష్.


ఇక ఈ సినిమాకు క్రిష్ తీసుకున్న రెమ్యునరేషన్ పై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న క్రిష్ ఆ తర్వాత బాలీవుడ్ మణికర్ణిక సినిమాకు 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులకు కలిపి ఓ 7, 8 కోట్లు ఇస్తారని భావించాడట క్రిష్. కాని బాలకృష్ణ నిర్మాత కాబట్టి క్రిష్ ఊహించని పారితోషికం ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడట.


ఈ సినిమాకు క్రిష్ ఏకంగా 11 కోట్ల భారీ పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. క్రిష్ తో బాలయ్యకు ఉన్న సానిహిత్యం అందరికి తెలిసిందే. అందుకే భారీ ఆఫర్ ఇచ్చాడట.. అంతేకాదు సినిమాను సంతృప్తి కరంగా తీసినందుకు ఆ పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తుంది. తన ప్రతి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే క్రిష్ ఎన్.టి.ఆర్ బయోపిక్ ను ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి చేశాడు. మరి అదెలా ఉందో బుధవారం తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: