మరో మూడు రోజులలో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ కు 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈమూవీ ఏ స్థాయిలో హిట్ అవుతుంది అన్న విషయమై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే ఈమూవీ పై జరుగుతున్న గ్రూప్ రాజకీయాలు ఈసినిమాకు శాపంగా మారుతాయా అన్న కోణంలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ ను దెబ్బకొట్టేందుకు కొన్ని గ్రూపులు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నాయి. సోషల్ మీడియాలో కొత్తగా విస్తరిస్తున్న ఆ గ్రూపులు ఎవరివీ అన్న    ప్రశ్నలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలను కలవర పరుస్తోంది. ఈసినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా  విడుదలైన మొదటిరోజు మొదటి ఆట నుండి ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ సినిమాపై నెగెటివ్ గా ప్రచారం చేసేందుకు కొన్ని వర్గాలు సోషల్ మీడియాలో అవకాసం కోసం ఎదురు చూస్తున్నాయి అంటూ వస్తున్న గాసిప్పులు ఈమూవీ బయ్యర్లకు తీవ్ర కలవర పాటును గురిచేస్తున్నాయి. 

ఇప్పటికే ఈమూవీ సెన్సార్ టాక్ అన్న పేరుతో ఈమూవీలో చెప్పుకోతగ్గ స్థాయిలో ఏవిషయాలు లేవనీ కేవలం ఒక డాక్యుమెంటరీలా ఉంటుందని ఇప్పటికే నెగిటివ్ ప్రచారం మొదలైపోయింది. వాస్తవానికి టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఆసినిమాలు విడుదల అవ్వక ముందు ఇలా నెగిటివ్ ప్రచారం జరగడం సాధారణమే అయినా ఈసారి ‘కథానాయకుడు’ మూవీ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం మరీ తీవ్ర స్థాయిలో ఉండటంతో ఈ వ్యవహారాన్ని వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరు అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు లోతైన విచారణ చేస్తున్నారు. 

ఎన్టీఆర్ బయోపిక్ కు వ్యతిరేకంగా ప్రస్తుతం ఈ నెగిటివ్ ప్రచారం చేస్తోంది మెగా హీరోల అభిమానులకు చెందిన గ్రూపులే అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు వివరిస్తున్నారు. ఈమూవీతో పోటీగా చరణ్ ‘వినయ విధేయ రామ’ రిలీజ్ అవుతున్న నేపధ్యంలో బయోపిక్ కు నెగెటివ్ టాక్ వస్తే అది చరణ్ సినిమాకు ప్లస్ అవుతుంది. దీనికితోడు ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ హిట్ అయితే మళ్ళీ ఎన్టీఆర్ మ్యానియా ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి ఆదిలోనే ఈమూవీని ఫెయిల్ చేయడం ద్వారా నష్టాలను నివారించుకోవాలని కొన్ని ప్రముఖ రాజకీయ పార్టీల అభిమానులు కూడ ఈ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సోషల్ మీడియాలో బాలకృష్ణ అభిమానుల కంటే మెగా కాంపౌండ్ హీరోలకే ఎక్కువ గ్రూపులున్నాయి. దీనితో ఈకారణాలు అన్నీ కలిసి ఎన్టీఆర్ బయోపిక్ ను దెబ్బ తీస్తాయా అన్న ఆందోళన నందమూరి అభిమానులలో వివరీతంగా పెరిగిపోతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: