బాలకృష్ణ ఎవరో తెలియదు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి ఆ కామెంట్స్ నందమూరి మెగా అభిమానుల మధ్య వార్ గా మారడం ఎట్టకేలకు నాగబాబు స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చాడు. తాను ఈవిషయమై ఎందుకు అలా కామెంట్ చేయవలసి వచ్చిండో సవివరంగా వివరించాడు. 
మరి మీరెందుకు ఫీలవుతున్నారు?
తానూ చేసిన కామెంట్స్ పై విపరీతంగా విమర్శలు వస్తున్న నేపధ్యంలో తను చేసిన కామెంట్స్ కు సమాధానం చెప్పవలసిన అవసరం ఏర్పడింది అంటూ తనకు వివాదాలు నచ్చవని అదే విధంగా అలంటి వివాదాల ద్వారా ఫోకస్ అవ్వల్సిన అవసరం కూడ తనకు లేదు అంటూ కామెంట్స్ చేసాడు. అయితే తాను చేసిన కామెంట్స్ కు ఒక కారణం ఉంది అంటూ ఆ కారణాలను వివరించడానికి ప్రయత్నించాడు నాగబాబు. 
వంద శాతం టార్గెట్ చేయలేదు
గతంలో బాలకృష్ణ  పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదు అన్నాడు కాబట్టి కౌంటర్ ఇచ్చానని అందరు అనుకుంటున్నారని దానికితోడు ఒక మాటకే అంత ఫీలైపోతే ఎలా ? అని తనను చాలామంది ప్రశ్నిస్తున్న విషయాలను బయటపెట్టాడు. అయితే వాస్తవానికి బాలకృష్ణ ఇప్పటికి ఆరు సార్లు తన ఫ్యామిలీ మీద తన  అన్నదమ్ముల మీద కామెంట్స్ చేసిన నేపధ్యంలో తాను  రంగంలోకి దిగవలసిన అవసరం ఏర్పడింది అంటూ కామెంట్స్ చేసాడు. 
అతడు మా ఫ్యామిలీ మీద ఆరు సార్లు కామెంట్ చేశాడు
అయితే పవన్ కళ్యాణ్ చిరంజీవి లాంటి వ్యక్తులు గొప్పవారు అయినా వారంతా  అందరికీ తెలియాల్సిన అవసరంలేదు అని అంటూ కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన సపోర్ట్ వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న విషయం బాలకృష్ణ మరిచిపోయాడా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు నాగబాబు. అంతేకాదు బాలయ్య గతంలో పవన్ కళ్యాణ్ తెలియదు అంటూ చేసిన కామెంట్స్ పై రాని ప్రశ్నలు తాను బాలకృష్ణను పేరు పెట్ట డా అన్యాపదేశంగా కామెంట్స్ చేసినా ఎందుకు లో రగులు తున్న వివాదానికి నాగబాబు క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఇక్కడితో ఈవివాదం ముగిసిపోతుంది అనుకోవాలి. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా పై నందమూరి అభిమానుల నెగిటివ్ కామెంట్స్ దాడి నుండి తప్పించు కోవడానికి తాత్కాలికంగా నాగబాబు ఇలా రుగులుతున్న వేడిని చల్లర్చడానికి ప్రయత్నించాడు అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: