రంగస్థలం తర్వాత రాం చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా బోయపాటి డైరక్షన్ లో తెరకెక్కించబడింది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ నెల 11న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ టైంలో అభిమానులకు టెన్షన్ పట్టుకుంది. టీజర్, ట్రైలర్ ఊరస్ మాస్ లుక్ లో చరణ్ కనిపిస్తున్నా సినిమా స్టోరీ విషయంలో తేడా కొడుతుంది.


బోయపాటి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. సెంటిమెంట్, యాక్షన్ ఈ రెండే మెయిన్ ఫ్లాట్ కథ దాదాపుగా అన్నిటికి ఒకేలా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఫ్యామిలీని విలన్ కష్టాల్లోకి నెట్టేస్తే తన ఫ్యామిలీని విలన్ నుండి ఎలా కాపాడుకున్నాడో అదే సినిమా కథ. వినయ విధేయతలు కలిగిన రాముడు ఫ్యామిలీ కోసం ఎంత విధ్వంసం సృష్టించాడో వెండితెర మీద చూడాల్సిందే.


సినిమా కథ మీద అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నా వారికి కావాల్సిన కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి భయపడాల్సింది ఏది లేదని అంటున్నారు. సినిమా కథ రొటీన్ గా ఉన్నా తన స్క్రీన్ ప్లేతో ఆడియెన్స్ లాక్ అయ్యేలా చేయడంలో బోయపాటి నేర్పరి. మరి ఆ మ్యాజిక్ ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి.


కియరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. రిలీజైన సాంగ్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయి. కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే కాదు రాం చరణ్ డ్యాన్సుల్లో కూడా ఇరగదీశాడని అంటున్నారు. 94.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: