ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి దర్శకుడు క్రిష్ మీడియాకు ఇంటర్వ్యూలలో ఇస్తున్న లీకులు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈసినిమాకు మ్యాగ్జిమమ్ డైరక్ట్ చేసింది బాలయ్య మాత్రమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు క్రిష్. వాస్తవానికి ఇదే విషయాలు ఈసినిమాలో నటించిన నటీనటులు కూడా చెపుతున్నారు. క్రిష్ కంటే బాలయ్య సూచనలే ఎక్కువగా ఫాలో అయ్యామని ఈమూవీలో నటించిన వారంతా లీకులు ఇవ్వడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ సినిమాకు సంబంధించి కీలకమైన నటీనటులతో రౌండ్ టేబుల్ సమావేశం తీరులో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూను ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసింది. ఆ చర్చలో పాల్గొన్న వాళ్లంతా దాదాపు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.
ఈమూవీలో క్రిష్ కంటే బాలయ్య డైరక్షనే ఎక్కువగా ఉందని వారంతా అభిప్రాయ పడ్డారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్, రానా, నరేష్, కల్యాణ్ రామ్ ఇలా అందరు ఒకే అభిప్రాయం వ్యక్తం చేసారు. హరికృష్ణ మేనరిజమ్స్ దగ్గర నుండి ఏఎన్నార్ మేనరిజమ్స్ వరకు బాలయ్య చెప్పింది తాము చేసామని చెపుతూ ఒక విధంగా ఈమూవీకి దర్శకుడు బాలకృష్ణ మాత్రమే అంటూ కామెంట్స్ చేసాడు.
వాస్తవానికి ఈవిషయాలను బాలకృష్ణ కూడ ఒక విధంగా గర్వంతో ఒప్పుకుంటున్నాడు. ఈమూవీలో చాల సీన్స్ కు దర్శకత్వం వహించింది తాను అయినప్పటికీ టోటల్ క్రెడిట్ మాత్రం క్రిష్ దక్కుతుంది అంటూ చెపుతున్నా క్రిష్ మాత్రం ఈమూవీకి దర్శకుడు బాలయ్య అయితే సహాయ దర్శకుడు స్థాయిలో మాత్రమే తాను పనిచేసాను అనడం షాకింగ్ గా మారింది. దీనితో ఈమూవీ ఫలితం బాగుంటే క్రిష్ దర్శకుడుగా ఆ గౌరవాన్ని అందుకోవడానికి లేకుంటే ఈమూవీ ఫలితంలో తేడా వస్తే ఆ రిజల్ట్ బాలయ్య ఖాతాలో వేయడానికి ఇలా వ్యూహాత్మకంగా క్రిష్ కామెంట్ చేసాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి..