ఎన్టీఆర్ బయోపిక్ విడుదలకు కేవలం 48 గంటలు కూడ లేని పరిస్థుతులలో ఈమూవీకి జనం మధ్య ఒక మ్యానియా క్రియేట్ చేయడానికి ఎన్ని ఎత్తుగడలు ఉంటాయో అన్నింటినీ నందమూరి బాలకృష్ణ అనుసరిస్తున్నాడు. ఒకవైపు నందమూరి ఫ్యామిలీ ఇగోని రెచ్చగొట్టే వ్యాఖ్యలు నాగబాబు వరసపెట్టి చేస్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా బాలయ్య నాగబాబు కామెంట్స్ ను చిత్తు కాగితాలతో సమానంగా చూస్తున్నాడు. 

నందమూరి అభిమానులు నాగబాబు పై మాటలు దాడి చేస్తున్నా తన ఆవిషయం ఏమీ సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు బాలకృష్ణ. ఇది ఇలా ఉంటే మన తెలుగు రాష్ట్రాలలో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ ప్రమోషన్ ను ఆసినిమా విడుదలయ్యే ధియేటర్ల లో పూజలు పాలాభిషేకం ద్వారా వినూత్నంగా నందమూరి అభిమానులు నందమూరి హీరోల ఇగోను మరింత పెంచుతున్నారు.

తెలుస్తున్న సమాచారం మేరకు సుమారు 100 ఎన్టీఆర్ విగ్రహాలను ‘కథానాయకుడు’ మూవీ ప్రదర్శించే ధియేటర్ల వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసారు. గతంలో ‘శ్రీవెంకటేశ్వర వైభవం’ సినిమా విడుదలైనప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాలను పెట్టి పూజలు చేసినట్లుగా ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలకు ఆసినిమా ప్రదర్శించే ధియేటర్లలో నందమూరి అభిమానుల చేతుల మీదుగా భక్తి భావంతో పూజలు జరుగుతున్నాయి. 

ట్విటర్ ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా సాధనాలు ద్వారా ఈపూజలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ నందమూరి అభిమానులు విపరీతమైన హడావిడి చేస్తున్నారు. అయితే ఈ హడావిడితో సరిసమానంగా ఈమూవీ పై నెగిటివ్ ప్రచారం చేయడానికి అనేక వ్యతిరేక శక్తులు ఎదురు చూస్తున్న నేపధ్యంలో ఈ పాలాభిషేకాలు పూజలు సాధారణ ప్రేక్షకుడుకి ఈమూవీ పట్ల మ్యానియాను ఎలా క్రియేట్ చేయగలుగుతుందో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: