నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రిలీజ్ టైం దగ్గర పడుతున్నా కొద్ది సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకున్నాయి. ఎన్.టి.ఆర్ సినిమా ప్రమోషన్స్ లో బాలయ్య ఉత్సాహంగా పాల్గొంటున్నారు.


ఇక సినిమా రిలీజ్ ప్రోమోస్ ఒక్కొక్కటిగా వదులుతున్నారు. అవి ఆడియెన్స్ లో సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబందించి ఎక్స్ క్లూజివ్ మొదటి షో డీటైల్స్ బయటకు వచ్చాయి. బుధవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా మొదటి షో హైదరాబాద్ భ్రమరాంభ థియేటర్ లో ఉదయం 5 గంటలకు పడుతుందట.


తెలంగాణాలో బెనిఫిట్ షోస్ కు పర్మిషన్ లేదు కనుక ఉదయం 5 గంటలకు షో ఏర్పాటు చేశారు. ఈ షోకి బాలకృష్ణ, క్రిష్ తో పాటుగా చిత్రయూనిట్ వచ్చే అవకాశం ఉందట. ఇక ఏపిలో కూడా ఆ తర్వాతే షోలు పడతాయని తెలుస్తుంది. అంటే మొదటి షో మాత్రం భమరాంభ థియేటర్ లోనే పడుతుందట.


అయితే ఈలోగా ముందు రోజు రాత్రి ఓవర్సీస్ ప్రీమియర్స్ ఆల్రెడీ పడతాయి. సో ఉదయం 5,6 గంటలకు మొదటి టాక్ వచ్చేస్తుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారట. సెన్సార్ నుండి ఎలాగు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి సినిమా తప్పకుండా మరో మహానటి సినిమా అవుతుందని అంటున్నారు. మరి క్రిష్ బాలకృష్ణ కలిసి ఏం చేశారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: