అందం ఉంటేనే హీరోయిన్. వెండి తెరను బంగారం చేయాలన్నా, వెన్నెలకు కురిపించాలన్నా సౌందర్య రాశి కావాలి. సొగసులతో సెగలు పుట్టించాలి. సోయగాలతో హొయలెత్తించాలి. తళుకుబెళుకులతో కులుకులొలికించాలి. మరి అన్నీ ఉన్న వారే సినిమా తెరను ఏలుతారు. అతి లోక సుందరిగా అభిమానుల కళ్ళలో  కలకాలం  కాపురం ఉంటారు.  రాశీ ఖన్నా సైతం అటువంటి అందగత్తెగానే టాలీవుడ్ ని ఏలుతోంది. 


లేటెస్ట్ గా మీడియాతో రాశీ ఖన్నా మాట్లాడుతూ తన మనసులోని భావాలను ఎన్నో చెప్పుకుంది. వ్యక్తిగత ఆరోగ్యంపైన నాకు అమితమైన శ్రద్ధ. ఆరోగ్యంగా, అందంగా ఉండేందుకు పరితపిస్తుంటాను. అందుకే ప్రతిరోజూ గంటన్నరపాటు వ్యాయామం చేస్తుంటాను. తీసుకునే ఆహారపదార్థాల్లో ఎక్కువ కారం ఉంటే నాకు ఇష్టం ఉండదు. అధిక మసాలా వేసి చేసిన వంటకాల జోలికి కూడా పోను’ అంటూ తన బ్యూటీ సీక్రెట్‌ను తెలిపింది. 


టాలీవుడ్‌లో రాణిస్తున్న హీరోయిన్‌ రాశీఖన్నా ఇప్పుడు కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ‘ఇమైక్కా నొడిగల్‌’తో తమిళ సినీరంగప్రవేశం చేసింది. తాజాగా హీరో జయంరవితో కలిసి ‘అడంగ మరు’ అనే చిత్రంలో నటించింది.ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో కూడా తన అందంతో ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని చూస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: