‘భరత్ అనే నేను’ మూవీతో టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయిన కీయరా అద్వాని ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు అందరితోను సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో ఆమెకు జీ తెలుగు ఛానల్ ప్రకటించిన అవార్డ్ ఉద్వేగంతో కంట కన్నీరు తెప్పించింది.
జీ తెలుగు ఛానల్ ప్రకటించిన అవార్డుల లిస్టులో `ఉత్తమ డెబ్యూ` పురస్కారాన్ని కియరాకు ఇచ్చినట్లు ప్రకటించగానే కియరా ఆనందానికి హద్దులు లేవు. ‘భరత్ అనే నేను’ నా జ్ఞాపకాల్లో నిలిచిపోయే సినిమా. వసుమతిగా నా నటనకు పేరొచ్చింది. సౌత్ ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని నన్ను ఓటింగ్ ద్వారా అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ఆమె ఉద్వేగంతో ఒక కామెంట్ పెట్టింది.
అంతేకాదు ఈవార్త తెలిసి తన కంట కన్నీరు వస్తోంది అంటూ భావోద్వేగానికి లోనైంది ఈబ్యూటీ. ఇదే సందర్భంలో తనకు పరిశ్రమలో ఈ అవకాశం రావడానికి సహకరించిన మహేష్ నమ్రతలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారిద్దరినీ ఆకాశానికి ఎత్తేసింది. ఇక తనకు వచ్చిన అవార్డు పై స్పందిస్తూ తెలుగు ప్రేక్షకుల్ని పీక్స్ లో ఓలలాడించడమే తన తక్షణ కర్తవ్యమని కొత్త సంవత్సరంలో గోల్ పెట్టుకుంది కియరా.
దీనితో ఈ అవార్డ్ తో కియరాకు 1000 గిగా వాట్ ఎనర్జీని వచ్చేసింది అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా త్వరలో ప్రారంభం కాబోతున్న బన్నీ త్రివిక్రమ్ ల మూవీలో కూడ కీయరా హీరోయిన్ గా ఎంపిక కావడం ఖాయం అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘వినయ విధేయ రామ’ ఊహించిన విధంగా హిట్ అయితే కీయరా మ్యానియా మరికొన్ని సంవత్సరాలపాటు కొనసాగే ఆస్కారం ఉంది