మరి కొన్ని గంటలలో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మూవీని బాలకృష్ణ చాల పట్టుదలగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈమూవీ విడుదల కాకుండానే ఈమూవీ పై నెగిటివ్ ప్రచారం విపరీతంగా జరుగుతున్న నేపధ్యంలో ఈమూవీకి సామాన్య ప్రేక్షకులలో మ్యానియా తీసుకురావడానికి బాలకృష్ణ క్రిష్ లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఈమూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే విధంగా ఈమూవీకి సంబంధించి ప్రతిరోజు రెండు అదనపు షోలను వేసుకోవడానికి సంక్రాంతి పండుగ అయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అదనపు షోలకు పర్మిషన్ లేకపోయినా కొన్ని ప్రత్యేకమైన అనుమతులతో రేపు ఉదయం 5 గంటల 50 నిముషాలకు బాలయ్య పెట్టుకున్న ముహూర్తంలో ఈసినిమాకు సంబంధించిన స్పెషల్ షో హైదరాబాద్ లోని భ్రమరాంబ ధియేటర్ లో ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ స్పెషల్ షోకు బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులందర్నీ ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ షోకు కళ్యాణ్ రామ్ జూనియర్లు కూడ రాబోతున్నారని టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ మూవీలో మేగ్జిమమ్ స్క్రీన్ స్పేస్ విద్యాబాలన్కి దక్కింది అని వార్తలు వస్తున్నాయి. దీనితో ఈసినిమాను విమర్శించేవారు ఇది బసవతారకం బయోపిక్ అని ప్రచారం చేసే ఆస్కారం కూడ ఉంది అని అంటున్నారు.
బాలకృష్ణ మీడియాకు ఇస్తున్న లీకుల ప్రకారం కథానాయకుడు’ మూవీ 'ఎన్టిఆర్ కథానాయకుడు' బసవతారకం మరణంతో ముగించబడ్తుందని తెలుస్తోంది. అయితే
అదేవిధంగా ఎన్టిఆర్ మహానాయకుడు'కి సంబంధించి కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో విద్యా బాలన్ కన్పించే అవకాశం వుందనీ, ఆ సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయిందనీ తెలుస్తోంది. ఒక విధంగా ఎన్టీఆర్ జీవితంలో చాల ఆలస్యంగా ప్రవేసించిన లక్ష్మి పార్వతి ప్రస్తావన లేకుండా క్రిష్ చాల తెలివిగా ఈ రెండు పార్టులకు సంబందించిన స్క్రీన్ ప్లేను చాల తెలివిగా మలిచాడని టాక్..