టాలీవుడ్లో ఇపుడు బయోపిక్కుల ట్రెండ్ నడుస్తోంది. ఓ పక్క  అన్న గారి జీవిత చరిత్రను బాలయ్య తెరకెక్కించి మూవీని కూడా రిలీజ్ చేసేస్తుంటే, స్వాతంత్ర సమయోధుడు ఉయాలవాడ  నరసింహారెడ్డి జీవిత చరిత్రను సైరా నరసింహారెడ్డి తీస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటిస్తూంటే కొడుకు రాం చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.


ఇక శైరా మూవీని 250 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాడ్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. మొదట సమ్మర్ కి ఈ మూవీ రిలీజ్ అనుకున్నారు కానీ ఇపుడు కాస్తా ముందుకు మార్చి దసరాకు రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సంగతికి స్వయంగా చిత్ర నిర్మాత హోదాలో రాం చరణ్ చెప్పడం విశేషం.


వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చరణ్‌, సైరా నరసింహారెడ్డి దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌, జగపతి బాబు, తమన్నా, సుధీప్‌, విజయ్‌ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్నో విశేషాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ అయ్యాక మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: