హీరోయిన్ ప్రియాంక తమిళ, మలయాళీ సినిమా ల్లో నటించింది. నటించింది కొద్దీ సినిమా ల్లోనే కావడం తో పెద్దగా ఈమె గురించి జనాలకు తెలియదు. అయితే దర్శకుడు లారెన్స్ రామ్ 2012లో ప్రేమ వివాహం చేసుకుని ఒక్కయ్యారు. ఎంత వేగంగా పేమించుకుని పెళ్లి చేసుకున్నారో అంతే వేగంగా ఈ జంట విడిపోయింది. మూడేళ్లకే మనస్పర్థలు ఏర్పడి వీరిద్దరూ విడిపోయారు. కానీ ఆ విషయం ఇటీవల పబ్లిక్ కు తెలిసింది. 

నటించడం ఇష్టం లేదు

నటి ప్రియాంక వసంత బాలన్ దర్శత్వం వహించిన వెయిల్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత కొన్ని తమిళ, మలయాళీ చిత్రాల్లో నటించింది. కానీ ప్రియాంకకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ సమయంలో దర్శకుడు లారెన్స్ రామ్ ప్రేమలోపడింది. ఈ జంట 2012 లో వివాహం చేసుకుని దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు.మూడేళ్లపాటు అన్యోన్యంగా సాగిన వీరి జీవనంలో కుమారుడు పుట్టాక మస్పర్థలు మొదలయ్యాయి.

ప్రైవేట్ ఫోటోలు లీక్

ప్రియాంక కొడుకుతో కలసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆ సమయంలో వీరిద్దరూ విడాకులు పొందారు. ఈ విషయాలని ప్రియాంక ఎప్పుడూ బయటకు ప్రస్తావించలేదు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంలో సమస్యలు ఎందుకు వచ్చాయో వివరించింది. తామిద్దరం ప్రైవేట్ గా గడిపిన ఫోటోలని ఆయన లీక్ చేశాడు. ఈ విషయం తెలిశాక నాకు చాలా అసహ్యంగా అనిపించింది. అలాంటి వ్యక్తితో కలసి జీవించలేక విడాకులు పొందానని ప్రియాంక స్పష్టం చేసింది. వీరు కుమారుడు ప్రస్తుతం ప్రియాంక వద్దనే ఉన్నాడు. కొడుకు కోసం లారెన్స్ రామ్ ఇటీవల కోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: