ఈ మద్య బాలీవుడ్ లో వరుసగా సినీ నటులు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మనిషా కోయిరాల, ఇర్ఫాన్ ఖాన్, సోనాలి బ్రిందేల ఆరోగ్యానికి సంబంధించిన వార్తల నుంచి తెరుకోక ముందే రాకేష్ రోషన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు ఆయన తనయుడు హీరో హృతిక్ రోషన్ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ రోజు(మంగళవారం) ఉదయం తండ్రి రాకేష్ రోషన్తో కలిసి జిమ్లో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసిన హృతిక్ తన తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నట్టుగా వెల్లడించారు.
రాకేష్ రోషన్ ఒకప్పుడు హీరోగా పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా తన సత్తా చాటుకున్నారు. మంగళవారం నుంచే అతనికి సర్జరీలు జరగనున్నట్లు హృతిక్ చెప్పాడు. రాకేష్ రోషన్ మొదటి దశలో ఉన్న గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నాడని ఈ నేపథ్యంలో సర్జరీలు జరగనున్నట్లు హృతిక్ చెప్పాడు.
క్యాన్సర్ అని తెలిసినా తన తండ్రి ఆత్మైస్థెర్యం ఏమాత్రం దెబ్బ తినలేదని, అలాంటి లీడర్ తమ కుటుంబంలో ఉన్నందుకు తాము అదృష్టవంతులమని అన్నాడు. గొంతు క్యాన్సర్లలో ఒకటైన స్కామస్ సెల్ కార్సినోమాతో రాకేష్ రోషన్ బాధపడుతున్నాడు. కాగా, రాకేష్ రోషన్ 1970లో వచ్చిన ఘర్ ఘర్ కీ కహానీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు.
బునియాద్, కామ్చోర్, ఖూబ్సూరత్లాంటి సినిమాలతో ఫేమస్ అయ్యాడు. 1987లో ఖుద్గర్జ్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. షారుక్తో కలిసి కోయ్లా, కరణ్ అర్జున్లాంటి హిట్ మూవీస్ తీశాడు. ఆ తర్వాత తన తనయుడు హృతిక్ రోషన్ ని ‘కహో నా ప్యార్ హై’ మూవీతో హీరోగా పరిచయం చేశాడు. కోయ్ మిల్ గయా, క్రిష్ సిరీస్లో ఈ తండ్రీ తనయులు కలిసి పని చేశారు.