నందమూరి అభిమానులు అంతా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాకు వస్తున్న ప్రశంసలు చూసి జోష్ లోకి వెళ్ళిపోతున్న సమయంలో లక్ష్మీ పార్వతి ఈరోజు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ పెను సంచలనాన్ని శ్రుష్టిస్తున్నాయి. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ను ఎంత కష్టపడి తీసినా ఎన్టీఆర్ జీవితం సగభాగమే అవుతుందని మిగతా భాగం తియ్యకుండా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కు న్యాయ్యం చేసినట్లు అవ్వదని ఆమె కామెంట్స్ చేశారు.
నిజాలు చూపిస్తున్నారని భావిస్తున్నా
ఇదే సందర్భంలో ఆమెను రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ కూడ కామెంట్ చేసింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  కు సంబంధించిన రెండవ పాట తనకు తీవ్ర మనోవేదనకు గురిచేసిందని వాస్తవానికి వర్మ మనసులో ఏముందో తనకు కూడ తెలియడం లేదు అంటూ ఆమె కామెంట్ చేసింది. ఎన్టీఆర్ జీవితంలోని వాస్తవాలు చూపెడతాడని తాను వర్మకు తన అంగీకారాన్ని చెప్పాను అని అంటోంది లక్ష్మి పార్వతి.
తొలిభాగం
వాస్తవానికి బాలకృష్ణ చాల మంచి వ్యక్తి అని అంటూ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత తమ కుటుంబం అంతా కలిసి ఉన్న సందర్భాలను ఆమె గుర్తు చేసుకున్నారు. జయసుధ జయప్రద శ్రీదేవి కృష్ణకుమారి సావిత్రి అంజలీదేవి లాంటి వ్యక్తులను వదిలి తనను పెళ్లి చేసుకున్నాడు అంటూ వర్మ పెట్టిన పాట తనకు ఏమాత్రం నచ్చలేదని ఈ పాట విషయమై తాను త్వరలో వర్మతో మాట్లాడబోతున్న విషయాన్ని ఆమె లీకులు ఇస్తోంది. 

దీనినిబట్టి చూస్తుంటే వర్మ లక్ష్మి పార్వతికి కూడ తెలియకుండా కొన్ని ప్రయోగాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో చేస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే లక్ష్మీ పార్వతి అంగీకారం లేకుండా వర్మ ఈసినిమాను విడుదల చేయలేడు కాబట్టి ఇలాంటి విషయాల పై ఎదో ఒక రాజీ వర్మ లక్ష్మీ పార్వతిల మధ్య కుదిరే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: