ఎన్టీఆర్ కథానాయకుడు నిన్న రిలీజ్ ఆయ్యి మంచి టాక్ ను స్వంతం చేసుకున్నది . అయితే సినిమా లో అద్భుతం అనిపించే సీన్స్ మరి ఎక్కువ గా లేవని చెప్పాలి. అందుకే ప్రేక్షకుడికి ఏదో తెలియని అసంతృప్తి కనిపిస్తుంది.  కానీ ప్రేక్షకులు మాత్రం కనెక్ట్ అయిన సీన్ ఒకటే. మాయబజార్ సినిమా కోసం శ్రీకృష్ణుడు పాత్రకు ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేసుకుంటారు కేవీరెడ్డి. కానీ ఇది నాగిరెడ్డి - చక్రపాణికి నచ్చదు.


ఆ సమయంలో.. మేకప్ వేసుకని వస్తున్న ఎన్టీఆర్ ని చూసి నాగిరెడ్డి - చక్రపాణి ఆశ్చర్యపోతారు. దేవుడంటే - కృష్ణుడంటే అచ్చు ఇలాగే ఉంటాడు అనుకుని మాయబజార్ మొదలుపెడతారు. సూపర్ హిట్ కొడతారు. చెప్పుకుంటూ పోతే ఇది మామూలు సీనే. కానీ ఈ సీన్ కు ముందు ఎస్టాబ్లిష్ మెంట్స్ - పనివాళ్లు కొబ్బరికాయలు కొట్టడం - పైనుంచి రంగులు పడడం - ఆ తర్వాత నాగిరెడ్డి దండం పెట్టడం.. ఇలా అన్నీ ఈ సీన్ ఇంటెన్సిటీ పెంచాయి.


ఎన్టీఆర్ కథా నాయకుడు : ట్విట్టర్ రివ్యూ హిట్టా ... ఫట్టా ...!

దీనికితోడు కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో.. సీట్లో కూర్చున్న ప్రేక్షకుడి నరాలు ఉప్పొంగుతాయి. ఇదిగో ఇలాంటి సీన్లనే ఆడియన్స్ కోరుకుంటారు. ఇలాంటి సీన్స్ ఫస్టాఫ్ లో రెండు - సెకండాఫ్ లో రెండో మూడో వచ్చి ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ మరో రేంజ్ లో ఉండేది. చివరకు పార్టీ పెట్టాలనుకున్న నిర్ణయంలో ఎన్టీఆర్ పడిన సంఘర్షణను చూపించారు కానీ.. ఆ ఎమోషన్ లో ప్రేక్షకుడ్ని ఇన్ వాల్వ్ చేయలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: