ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. ఈ సినిమాను చూసిన ప్రతీ వారు బాగుందని అంటున్నారు. పెద్దాయనను మళ్ళీ గుర్తుకు తెచ్చారని కూడా పేర్కొంటున్నారు. తెలుగు సినిమాకు, తెలుగు జాతికి ఘమైన కీర్తిని తెచ్చిన ఎన్టీఆర్ మళ్ళీ చాన్నాళ్ల తరువాత  వెండి తెరపైన చూసినట్లైందని కూడా ప్రశంసలు వచ్చాయి.


అయితే ఈ సినిమాను చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు బాగుందని చెప్పడమే కాదు. ఎన్టీఆర్ కి ఇదే నిజమైన నివాళి అనడం విశేషం. ఎన్టీఆర్ గా బాలయ్య జీవించారని, అలాగే క్రిష్ దర్శకుడిగా అద్భుతమైన పనితనం చూపించారని, ఇతర నటీనటులు కూడా తమదైన శైలిలో నటనను ప్రదర్శించారని  మహేష్ ప్రశంసించడం జరిగింది. గతంలోనూ మహేష్ తనకు నచ్చిన చిత్రాలపై ఇదే రకమైన కామెంట్స్ పాజిటివ్ గా చేస్తూ తన మంచి మనసును చాటుకున్నారు.


కాగా మహేష్ చేసిన కామెంట్స్ కి క్రిష్ ట్విట్టర్ ద్వారానే రిప్లై ఇస్తూ థాంక్స్   చెప్పారు. ఇక ఈ మూవీపై వస్తున్న మంచి ప్రశంసలను చూసి తాను గర్వంగా  ఆనందంగా ఉన్నానని క్రిష్ అనడం విశేషం. తెలుగు జాతి మహనీయుడి చరిత్రను తెరపైన చూపించడం ద్వారా తాను ఎంతో సంతోషంగా ఉన్నానని క్రిష్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఎన్టీఆర్ కథానాయకుడు యూనిటి హిట్ ఆనందాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: