తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించన హీరో అజిత్ కుమార్.  వేదలం నుంచి అజిత్ రుసగా విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.  తాజాతా శివ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘విశ్వాసం’నేడు తమిళ నాట రిలీజ్ అయ్యింది.  ఇదే రోజు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పెట్టా’మూవీ రిలీజ్ అయ్యింది.  ఈ స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో ఫ్యాన్స్ ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.  కానీ కొంత మంది ఫ్యాన్స్ మద్య ఇవి చిచ్చు పెట్టాయి. 

ఇక స్టార్ హీరో ఫ్యాన్స్ చేసే పనుల వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి.  కన్నడ హీరో యష్ కోసం వెళ్లిన ఓ అభిమాని సెక్యూరిటీ గార్డులు ఆపారని పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు.  ఈ రోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.  ఈ దుర్గటన మరువక ముందే..కోలీవుడ్‌లో ర‌జ‌నీకాంత్‌, అజిత్ అభిమానులు క‌త్తుల‌తో పొడుచుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.  ఈ  సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద వేలాది మంది చేరి బాణాసంచా కాల్చి, ఫ్లెక్సీ లకు పాలాభిషేకం చేశారు.

తమ హీరో గొప్ప అంటే త‌మ హీరో గొప్ప అంటూ కొన్ని చోట్ల ఫ్యాన్స్ ఘ‌ర్ష‌ణ‌ల‌కి దిగారు. వేలూరులోని ఓ థియేటర్‌ కొందరు కత్తులతో దాడులకు దిగడంతో నలుగురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని చెదరగొట్టి..క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు మూవీలు ప్రదర్శిస్తున్న సినిమా హాళ్ళవద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే పరిస్థితి ఏంటో అక్కడి వారికి తెలిసి వచ్చింది. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ హీరోలదే.  మొత్తానికి సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన పేటా, విశ్వాసం చిత్రాల‌కి పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌డంతో అభిమానుల‌లో ఆనందోత్సాహాలు నెల‌కొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: