ఈ సారి టాలీవుడ్ సంక్రాంతి పండుగకు విడుదల చేసిన సినిమాలు వినోదం కలిగించకపోగా ప్రేక్షకులకు ఒకటి అబద్ధాలను అందిస్తే మరొకటి తలపోటును తెచ్చిపెట్టింది. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు టాలీవుడ్ సినిమాల విడుదలలతో కళ కళలాడటం ఆనవాయితీ. అయితే అది గతం, ఇప్పుడు పరిస్థితి మారింది. నాలుగైదు సినిమాలు సంక్రాంతి పండక్కి విడుదలయ్యేవి. కాని ఇప్పడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడైతే మూడు స్ట్రెయిట్ సినిమాలు మాత్రమే విడుదల అవుతుండగా అందులో రెండు ఇప్పటికే విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. ఈ సంక్రాంతికి ఇంకా ఒక సినిమానే విడుదల అవనుంది.
ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, రామ్ చరణ్ వినయ విధేయ రామ, వెంకీ-వరుణ్ల ఎఫ్ 2 సినిమాలు ఈ పండక్కి విడుదలవుతున్నాయి. వీటిలో కథానాయకుడు, వినయ విధేయ రామ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకు మిక్స్డ్-టాక్ రావడంతో అభిమానులు పూర్తి నిరాశలో ఉన్నారు. కథానాయకుడు సినిమా అనుకున్నంత లేదని వినిపిస్తుంది సినిమాలో కొన్ని సీన్లు మాత్రమే బాగున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక ఈ రోజే విడుదలైన రామ్ చరణ్ వినయ విధేయ రామ కూడా అనుకున్నంత గొప్పగా లేదనే సమాచారం. బోయపాటి శీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధారుణ హింస తప్ప మరో కటి లేదని తేల్చేశారు ప్రేక్షకులు. ఇక ప్రేక్షకుల పండగ ఆశలన్ని వెంకీ-వరుణ్ల 'ఎఫ్ 2' సినిమాపైనే ఉన్నాయి. రెండు సినిమాలు ఇప్పటికే జనాన్ని నిరాశ పరచగా పండక్కి విడుదల వుతున్న చివరి సినిమా ఇది. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.
పండక్కి ఫ్యామిలీతో కలిసే చూసే వినోదాత్మక సినిమా ఇదొక్కటే, కావడంలో వినోదం అందిచ్చె జోనర్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.పైగా ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా వెంకీ చాలా రోజులు తరువాత ఫుల్ కామెడీ క్యారెక్టర్ చేయడం, తమన్నా, మెహ్రీన్ లు కురిపించే గ్లామర్ వరద సినిమాకు ఫ్లస్ పాయింట్గా నిలిచే అవకాశం ఉంది.
సినిమా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమా చూడాలని 'ఫిక్స్' అయినట్లు కనిపిస్తోంది.సంక్రాంతికి విడుదలైన రెండు సినిమాలు ఆకట్టుకోకపోవటంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా పైనే పడింది. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగను 'క్యాష్' చేసుకుంటుందో లేదో చూడాలి. ఎఫ్-2 సినిమా రేపే (శనివారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.