ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు సినీ సీమ సామాజికవర్గ పరంగా చీలిపోయిందన్నది వాస్తవం. దాంతో తెలియని విభేదాలు టాలీవుడ్ ని పట్టిపీడిస్తున్నాయి. అది నిన్నటి నాగబాబు ఇష్యూ బయటపెట్టింది కూడా. బాలక్రిష్ణను టార్గెట్ చేస్తూ వరసగా ఆరు రోజుల పాటు మెగా బ్రదర్ ఇచ్చిన  కౌంటర్లు ఇపుడు టాలీవుడ్లో కొత్త చర్చను రేపుతున్నాయి. ఇది ఇంతటితో వదిలేయాలంటూ నాగబాబు చివరి ఎపిసోడ్లో చెప్పినప్పటికీ అంత తేలిగ్గా ఈ వ్యవహారం సద్దుమణుగుతుందా అన్నది చర్చగా ఉంది.


ఇక ఇప్పటివరకూ నాగబాబు విషయంలో నో కామెంట్ తో సరిపెట్టిన బాలయ్య నిజానికి చాలా బిజీగా ఉన్నారు. తన చిత్రం కధానాయకుడు ప్రమోషన్లో భాగంగానే ఆయన నిన్నటి వరకూ ఉంటూ వచ్చారు. ఇపుడు ఆ సినిమా రిలీజ్ కావడంతో ఆయనకు ఇపుడు ఈ కామెంట్శ్ పై సీరియస్ గానే ద్రుష్టి సారిస్తారని అంటున్నారు. నిజానికి బాలయ్య చాలా ఆవేశపరుడు. ఆయన్ని కెలికి నాగబాబు ఇపుడు ఇష్యూ రైజ్ చేశారు. మళ్ళీ వార్నింగ్ ఇస్తూ మరో మారు అంటే కౌంటర్లు తప్పవని కూడా చెప్పేశారు. ఇదే నందమూరి ఫ్యాన్స్ ని  ఇపుడు హర్ట్ చేస్తోందిట. తమ హీరోను అన్ని మాటలు అనేసి మళ్ళీ కామెంట్స్ చేయొద్దని చెప్పడమేంటని కూడా మండిపడుతున్నారు.


ఫ్యాన్స్ తీరు ఎలా ఉన్న బాలయ్య మాత్రం ఊరుకునే రకం కాదని కూడా కొందరు అంటున్నారు. రానున్నవి ఎన్నికల సీజన్, టీడీపీ తరఫున బాలయ్య ప్రచారం ఎలాగూ చేస్తారు. అపుడు నాగబాబు కామెంట్స్ కి పవర్ ఫుల్ పంచులు బాలయ్య వదులుతాడని కూడా అంటున్నారు. మరో వైపు ఇది రాజకీయ రంగు కూడా పులుముకోవడంతో టాలీవుడ్లో పెద్దలు దీనిపైన మధన పడుతున్నారు. సినిమా పరిశ్రంలో హెల్తీ వెదర్ లేకుండా ఇలాంటివి చేస్తాయని కూడా అంటున్నారు. బాలయ్య నో కామెంట్ తో హుందాగానే వ్యవహరించారని, ఆయన అక్కడితో  అగిపోతేనే బాగుంటుందని కూడా అంటున్న వారు ఎక్కువగానే ఉన్నారు. మరి సినిమా రాజకీయం కలగలసిపోయిన వేళ, ఇంకో వైపు వర్గ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్న వేళ ఇది ఇక్కడితో ఆగుతుందా, వెనక ఉన్న వారు ఆగనిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: