టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనుష్క ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించింది. ఈ మద్య లేడీఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తున్న అనుష్క ఇటీవల ‘భాగమతి’సినిమాలో నటించి మంచి సక్సెస్ సాధించింది. బాహుబలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క ‘భాగమతి’ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుంది. తన తదుపరి సినిమాపై ఎన్నో వార్తలు వస్తున్నా అవన్నీ ఖండిచింది. ప్రస్తుతం తాను ఫిట్ నెస్ పై దృష్టి పెడుతున్నా అంటున్న అనుష్క ఇటీవల రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహ వేడుకలో బొద్దుగానే కనిపించింది.
ఇక హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి ఒక నిర్మాతగా కోన వెంకట్ వ్యవహరిస్తున్నాడు. కథ నేపథ్యం ప్రకారం 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మూవీ చిత్రీకరణ ఎక్కువ శాతం అమెరికాలో జరగనుందని తెలుస్తుంది. తెలుగు తమిళ భాషలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా నటిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో తమిళ నటుడు మాధవన్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల సవ్యసాచి అనే సినిమాలో ప్రతి నాయకుడిగా కనిపించి అలరించాడు. ప్రస్తుతం రాకెట్రీ అనే చిత్రం చేస్తున్నాడు. తాజాగా ఈ విషయంపై మాధవన్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. హే గాయ్స్ .. నేను అనుష్క సినిమాలో చేస్తున్నట్టు వస్తున్నవార్తలు అవాస్తవం.
ప్రస్తుతం ఏ సినిమాలో కీ రోల్స్ చేయడం లేదు అని అన్నాడు. మాధవన్ క్లారిటీతో అనుష్క సినిమాలో మాధవన్ నటించడం లేదని అర్ధమైంది. ప్రస్తుతం మాధవన్ చేస్తున్న రాకెట్రీ సినిమా ఇస్రో సైంటిస్ట్ నంబీ నారాయణన్ జీవిత నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాపై అభిమానులలలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.