సంక్రాంతి సినిమాల పై ప్రిన్సు మహేష్ వరుసగా పెట్టిన ట్విట్స్ మెగా అభిమానులకు తీవ్ర అసహనం కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘కథానాయకుడు’ మూవీ నుంచి మొదలుపెట్టి మొన్నవిడుదల అయిన ‘ఎఫ్ 2’ వరకు ప్రతి సినిమాను మెచ్చుకుంటూ మహేష్ ట్విట్స్ పెడుతున్నాడు. అయితే ఈలిస్ట్ లో ‘వినయ విధేయ రామ’ మాత్రం మిస్ కావడం మెగా అభిమానులకు అసహనాన్ని కలిగిస్తోంది. 
భారీ మొత్తానికి హక్కులు
ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నపటికీ మహేష్ సంక్రాంతి సినిమాలపై వరుసగా రియాక్ట్ అవుతూ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. ‘కథానాయకుడు’ సినిమాను ఎన్టీఆర్ కు బెస్ట్ ట్రిబ్యూట్ గా పేర్కొంటూ ‘కథానాయకుడు’ కంటే బెటర్ సినిమా ఏదైనా ఉందంటే అది మహానాయకుడు మాత్రమే అంటూ ఆ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా పట్టించుకోకుండా ప్రశంసలు కురిపించాడు. అంతటితో ఆగకుండా ఆ మరుసటిరోజు ‘పేట’ సినిమాను పొగిడి మరింత షాక్ ఇచ్చాడు. 
ఆ సీన్లపై భారీగా కత్తెర
రజనీ అభిమానులకు ‘పేట’ సినిమా అంకితం ఇవ్వడమే కాకుండా ఈ సినిమాలో నటించిన   రజనీకాంత్ ను పోగాడటమే కాకుండా ఆ  సినిమా దర్శకుడ్ని సినిమాటోగ్రాఫర్ పై ప్రశంసలు కురిపించాడు. అయితే ఆ తరువాత రోజున విడుదల అయిన ‘వినయ విధేయ రామ’ గురించి ఏమి మాట్లాడకుండా ఆ మరుసటిరోజు విడుదల అయిన ‘ఎఫ్ 2’ పై కూడా ప్రశంసలు కురిపించాడు.   
మలయాళ, తమిళంలోకి
దీనితో చరణ్ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఇలా మహేష్ ప్రవర్తించాడా లేదంటే కావాలనే మహేష్ సినిమాను ఎవాయిడ్ చేసాడా అని చరణ్ అభిమానులు తీవ్ర అసహనానికిలోనవుతున్నారు. అంతేకాదు ఇన్ని సినిమాలను వరసపెట్టి చూసిన మహేష్ కు కేవలం చరణ్ సినిమాను చూడటానికి మాత్రం సమయం దక్కలేదా అంటూ చరణ్ అభిమానులు మహేష్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.  ఒకవేళ సూపర్ హిట్ సినిమాల గురించి మాత్రమే మహేష్ కామెంట్ చేస్తాడు అని భావిస్తే ‘కధానాయకుడు’ ‘పేట’ సినిమాలు సూపర్ హిట్ కాలేదు కదా అంటూ మెగా అభిమానులు మహేష్ కు ప్రశ్నలు వేస్తున్నారు.. 
.


మరింత సమాచారం తెలుసుకోండి: